Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఓటుకు నోటు కేసులో కీలక మలుపు, వారికి షాక్: సుప్రీం ఓకే, ఆళ్ల ఏమన్నారంటే

రెండేళ్ల క్రితం ఓటుకు నోటు కేసు రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేసింది. ఈ కేసులో ఇప్పటి దాకా పురోగతి లేదనే వాదనలు ఉన్నాయి.

హైదరాబాద్/అమరావతి: రెండేళ్ల క్రితం ఓటుకు నోటు కేసు రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేసింది. ఈ కేసులో ఇప్పటి దాకా పురోగతి లేదనే వాదనలు ఉన్నాయి.

ఈ కేసులో పురోగ‌తి లేద‌ని, కొన్ని పరిణామాల నేపథ్యంలో విచారణలో జాప్యం చోటుచేసుకుందని చెబుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఇటీవల సుప్రీం కోర్టులో పిటిష‌న్ వేశారు.

Recommended Video

    Chandrababu Naidu Safe Or Not in Cash For Vote Case ? - Oneindia Telugu

    ఏసీబీ దర్యాఫ్తు నిష్పక్షపాతంగా లేదని

    ఏసీబీ దర్యాఫ్తు నిష్పక్షపాతంగా లేదని

    తెలంగాణ ఏసీబీ ఈ కేసులో దర్యాప్తును నిష్పక్షపాతంగా చేయడం లేదని ఆళ్ల పేర్కొన్నారు. ఈ కేసును సీబీఐ (సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) దర్యాప్తుకు అప్పగించాలని కోరారు. ఈ పిటిష‌న్‌ను ప‌రిశీలించిన సుప్రీం దాన్ని స్వీక‌రించింది.

    త్వరలో విచారణ తేదీలు

    త్వరలో విచారణ తేదీలు

    దాంతో పాటు ఓటుకు కోట్లు ప్రధాన కేసుకు ఈ తాజా పిల్‌ని జత చేయాలని అత్యున్నత న్యాయస్థానం సూచించింది. విచారణ తేదీలను త్వరలో ఖరారు చేస్తామ‌ని కోర్టు తెలిపింది. సుప్రీం స్వీకరించడం టీడీపీ, రేవంత్ రెడ్డిలకు షాక్ అని అంటున్నారు.

    తొలి, రెండో ఛార్జీషీట్ల మధ్య తేడా

    తొలి, రెండో ఛార్జీషీట్ల మధ్య తేడా

    ఓటుకు నోటు వ్యవహారం జరిగి రెండున్నరేళ్లు అయిందని, తదుపరి పరిణామాల నేపథ్యంలో విచారణలో జాప్యం చోటు చేసుకుందని, తెలంగాణ ఏసీబీ దర్యాఫ్తు నిష్పక్షపాతంగా చేయడం లేదని మొదటి ఛార్జీషీటుకు, రెండో ఛార్జీషీటుకు వ్యత్యాసం ఉందని ఆర్కే తన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిని కోర్టు స్వీకరించింది.

    ఆళ్ల హర్షం, బాబుది రుజువైంది, ముందుకుపోకుండా ప్రయత్నాలు

    ఆళ్ల హర్షం, బాబుది రుజువైంది, ముందుకుపోకుండా ప్రయత్నాలు

    కోర్టు ఆదేశాలపై ఆళ్ల రామకృష్ణా రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఓటుకు నోటు కేసుకు సంబంధించి చంద్రబాబు ఆడియో, వీడియో టేపుల్లో అడ్డంగా దొరికిపోయాడని ఆరోపించారు. అయితే ఈ కేసు విచారణ ముందుకు జరగకుండా ఆయన విశ్వప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఆడియో టేపుల్లో మాట్లాడింది చంద్రబాబేనని రుజువైందని, ఆయన పాత్ర బయటపడాలంటే సీబీఐ విచారణ జరగాలన్నారు.

    ఆళ్ల లాయర్ మాట్లాడుతూ...

    ఆళ్ల లాయర్ మాట్లాడుతూ...

    మరోవైపు, ఎమ్మెల్యే ఆర్కే లాయర్ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఏసీబీ దర్యాఫ్తు సరిగా చేయడం లేదన్నారు. కేసును నీరుగార్చే ప్రయత్నం జరుగుతోందన్నారు. నిష్పక్షపాత దర్యాఫ్తు కోసం సీబీఐ విచారణ జరగాలని ఆర్కే పిటిషన్ వేశారన్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+