రాజకీయం వారసత్వం, ప్రజాస్వామ్యం ధనస్వామ్యం: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
హైదరాబాద్: రాజకీయాలు ప్రస్తుత కాలంలో వారసత్వంగా మారిపోయాయని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సోమవారం అన్నారు. ఆయన హైదరాబాదులోని శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
ప్రజాస్వామ్యం అయిదు సంవత్సరాలకు ఒకసారి వచ్చేది కాదని ఆయన చెప్పారు. ప్రజాప్రాతినిథ్య ప్రజాస్వామ్యం ఉండాలని అభిప్రాయపడ్డారు. ప్రజల అభిప్రాయాల నుంచే విధాన నిర్ణయాలు తీసుకోవాలన్నారు.

డబ్బులు తీసుకుని ఓటు వేసే సంస్కృతి మారాలని వ్యాఖ్యానించారు. రాజకీయమనేది వారసత్వం అయిపోతోందని, ప్రజాస్వామ్యం అనేది ధనస్వామ్యం అయిపోతోందన్నారు. వ్యక్తి ఆరాధన వదిలి వ్యక్తిత్వ ఆరాధన చేయాలని, సామాజిక వర్గాలు ముఖ్యం కాదని, సమాజం ముఖ్యమన్నారు.












Click it and Unblock the Notifications