వివేకా కేసులో బిగ్ ట్విస్ట్- పులివెందులలో మళ్లీ సీబీఐ, ఈ సారి నేరుగా..!!
వివేకా హత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 2019 నుంచి వివేకా హత్య కేసు అనేక మలుపులు తిరిగింది. సీబీఐ సుదీర్ఘంగా విచారణ చేసింది. వివేకా కుమార్తె సునీత సుప్రీంను ఆశ్రయించారు. హైకోర్టు - సుప్రీంకోర్టులో ఈ కేసు లో భాగంగా అనేక అంశాల పైన విచారణ సాగింది. కాగా.. రెండేళ్ల విరామం తరువాత ఇప్పుడు మరోసారి సీబీఐ రంగంలోకి దిగింది. పులివెందుల కేంద్రంగా విచారణ మొదలు పెట్టింది. ఈ పరిణామం ఇప్పుడు వివేకా కేసులో బిగ్ టర్న్ గా మారుతోంది.
వివేకా హత్య కేసులో మరో సారి సీబీఐ రంగంలోకి దిగింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో రెండేళ్ల తర్వాత మళ్లీ సీబీఐ విచారణ ప్రారంభించింది. తాజాగా ఈ కేసులో నిందితుడు సునీల్ యాదవ్, సాక్షిగా ఉన్న భరత్ కుమార్ యాదవ్ సోదరులు కిరణ్ యాదవ్, మహేంద్ర యాదవ్ను పులి వెందుల పోలీస్ స్టేషన్ లో ప్రశ్నించారు. కొందరు వ్యక్తులు తనను చంపాలని కుట్ర చేస్తున్నారని సునీల్ యాదవ్ సోదరుడు కిరణ్ యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు. వివేకా హత్య చోటు చేసుకున్న రోజు తెల్లవారుజామున 1.42 గంటలకు అర్జున్ రెడ్డి అనే వ్యక్తికి కిరణ్ కుమార్ వాట్సప్ కాల్ చేశారు. వీరిద్దరి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ పై సీబీఐ అధికారులు ప్రశ్నించారు. అలాగే కిరణ్, మహేంద్ర మధ్య సాగిన ఫోన్ సంభాషణలపై కూడా విచారించారు. వీరిని 2 గంటల పాటు సీబీఐ అధికారి రోహిత్ యాదవ్ విచారించారు. కాల్ డేటా ఆధారంగా అనుమానితులను ప్రశ్నించి సమాధానాలు రాబట్టారు.

పులివెందులలో మకాం.. వరుస విచారణలు
కాగా, ఈ కేసులో అసలు కుట్రదారులను వెలికితీయాలని సునీత దాఖలు చేసిన పిటిషన్ ఆధారం గా కిరణ్ యాదవ్- అర్జున్ రెడ్డి మధ్య ఫోన్ సంభాషణలపై దర్యాప్తు కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో సీబీఐ మళ్లీ రంగంలోకి దిగింది. తాజాగా పులివెందుల వచ్చిన సీబీఐ అధికారులు కేసులో సాక్షిగా ఉన్న భరత యాదవ్ సోదరుడు మహేంద్ర యాదవ్ను ప్రశ్నించారు. కాగా.. వివేకా హత్య విషయం 2019 మార్చి 15న ఉదయం 6 గంటల 15 నిమిషాలకు పీఏ కృష్ణారెడ్డి ద్వారా బాహ్య ప్రపంచానికి తెలిస్తే అర్ధరాత్రి ఒకటి 42 నిమిషాలకు కిరణ్ యాదవ్ అనే వ్యక్తి అర్జున్ రెడ్డికి వాట్సాప్ మెసేజ్ చేసినట్లు సీబీఐ అధికారులు గుర్తించారు. అంతముందు ఎలా తెలిసిందని కిరణ్ యాదవ్ను 2 గంటల పాటు ప్రశ్నించారు. వివేకా హత్య కేసులో తాజా పరిణామాలు చూస్తుంటే, కొందరు వ్యక్తులు తమను హత్య చేయలని కుట్ర చేస్తున్నారని కిరణ్ యాదవ్ ఆరోపించారు. కాగా తదుపరి విచారణలో భాగంగా సీబీఐ మరికొందరిని విచారించే అవకాశం ఉంది. కాగా.. కిరణ్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ సీబీఐ విచారణకు పూర్తిగా సహకరిస్తానని, వారడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చానని చెప్పారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications