వివేకా కేసులో బిగ్ ట్విస్ట్- పులివెందులలో మళ్లీ సీబీఐ, ఈ సారి నేరుగా..!!
వివేకా హత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 2019 నుంచి వివేకా హత్య కేసు అనేక మలుపులు తిరిగింది. సీబీఐ సుదీర్ఘంగా విచారణ చేసింది. వివేకా కుమార్తె సునీత సుప్రీంను ఆశ్రయించారు. హైకోర్టు - సుప్రీంకోర్టులో ఈ కేసు లో భాగంగా అనేక అంశాల పైన విచారణ సాగింది. కాగా.. రెండేళ్ల విరామం తరువాత ఇప్పుడు మరోసారి సీబీఐ రంగంలోకి దిగింది. పులివెందుల కేంద్రంగా విచారణ మొదలు పెట్టింది. ఈ పరిణామం ఇప్పుడు వివేకా కేసులో బిగ్ టర్న్ గా మారుతోంది.
వివేకా హత్య కేసులో మరో సారి సీబీఐ రంగంలోకి దిగింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో రెండేళ్ల తర్వాత మళ్లీ సీబీఐ విచారణ ప్రారంభించింది. తాజాగా ఈ కేసులో నిందితుడు సునీల్ యాదవ్, సాక్షిగా ఉన్న భరత్ కుమార్ యాదవ్ సోదరులు కిరణ్ యాదవ్, మహేంద్ర యాదవ్ను పులి వెందుల పోలీస్ స్టేషన్ లో ప్రశ్నించారు. కొందరు వ్యక్తులు తనను చంపాలని కుట్ర చేస్తున్నారని సునీల్ యాదవ్ సోదరుడు కిరణ్ యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు. వివేకా హత్య చోటు చేసుకున్న రోజు తెల్లవారుజామున 1.42 గంటలకు అర్జున్ రెడ్డి అనే వ్యక్తికి కిరణ్ కుమార్ వాట్సప్ కాల్ చేశారు. వీరిద్దరి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ పై సీబీఐ అధికారులు ప్రశ్నించారు. అలాగే కిరణ్, మహేంద్ర మధ్య సాగిన ఫోన్ సంభాషణలపై కూడా విచారించారు. వీరిని 2 గంటల పాటు సీబీఐ అధికారి రోహిత్ యాదవ్ విచారించారు. కాల్ డేటా ఆధారంగా అనుమానితులను ప్రశ్నించి సమాధానాలు రాబట్టారు.

పులివెందులలో మకాం.. వరుస విచారణలు
కాగా, ఈ కేసులో అసలు కుట్రదారులను వెలికితీయాలని సునీత దాఖలు చేసిన పిటిషన్ ఆధారం గా కిరణ్ యాదవ్- అర్జున్ రెడ్డి మధ్య ఫోన్ సంభాషణలపై దర్యాప్తు కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో సీబీఐ మళ్లీ రంగంలోకి దిగింది. తాజాగా పులివెందుల వచ్చిన సీబీఐ అధికారులు కేసులో సాక్షిగా ఉన్న భరత యాదవ్ సోదరుడు మహేంద్ర యాదవ్ను ప్రశ్నించారు. కాగా.. వివేకా హత్య విషయం 2019 మార్చి 15న ఉదయం 6 గంటల 15 నిమిషాలకు పీఏ కృష్ణారెడ్డి ద్వారా బాహ్య ప్రపంచానికి తెలిస్తే అర్ధరాత్రి ఒకటి 42 నిమిషాలకు కిరణ్ యాదవ్ అనే వ్యక్తి అర్జున్ రెడ్డికి వాట్సాప్ మెసేజ్ చేసినట్లు సీబీఐ అధికారులు గుర్తించారు. అంతముందు ఎలా తెలిసిందని కిరణ్ యాదవ్ను 2 గంటల పాటు ప్రశ్నించారు. వివేకా హత్య కేసులో తాజా పరిణామాలు చూస్తుంటే, కొందరు వ్యక్తులు తమను హత్య చేయలని కుట్ర చేస్తున్నారని కిరణ్ యాదవ్ ఆరోపించారు. కాగా తదుపరి విచారణలో భాగంగా సీబీఐ మరికొందరిని విచారించే అవకాశం ఉంది. కాగా.. కిరణ్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ సీబీఐ విచారణకు పూర్తిగా సహకరిస్తానని, వారడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చానని చెప్పారు.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications