హైస్కూల్ బాత్రూమ్లో సీసీ కెమెరా: కేకలు పెట్టిన విద్యార్థినులు..
బాత్రూమ్ కు పైకప్పు లేకపోవడంతో.. ఒక చెట్టుకు దాన్ని వేలాడదీసి, కొమ్మల్లో కనిపించకుండా అమర్చినట్లు తెలుస్తోంది.
నర్సీపట్నం: ఓ హైస్కూల్ పాఠశాల బాత్రూమ్ పైభాగంలో సీసీ కెమెరా ఏర్పాటు చేసిన సంఘటన కలకలం రేపింది. విద్యార్థినులను రహస్యంగా చిత్రీకరించేందుకే ఆకతాయిలు ఈ పనికి ఒడిగట్టినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. విశాఖపట్నం జిల్లా గోలుగొండ మండలం చోద్యం జిల్లా పరిషత్ హైస్కూల్లో ఈ ఉదంతం వెలుగుచూసింది.
గురువారం రోజు స్కూల్ కు వెళ్లిన విద్యార్థినులు.. బాత్రూమ్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడాన్ని గుర్తించారు. బాత్రూమ్ లకు పైకప్పు లేకపోవడంతో.. దానిపై వేలాడుతున్న ఓ చెట్టుకొమ్మకు కొంతమంది ఆకతాయిలు సీసీ కెమెరాను అమర్చారు. చిన్న కర్ర సహాయంతో సీసీ కెమెరాను కనిపించకుండా చెట్టు కొమ్మల్లో దాగేలా ఏర్పాటు చేశారు.

అయితే ఆకుల చాటు నుంచి రెడ్ సిగ్నల్ స్పష్టంగా కనిపిస్తుండటంతో.. విద్యార్థినులకు దీనిపై అనుమానం కలిగింది. వెంటనే కేకలు వేస్తూ వెళ్లి ఉపాధ్యాయులకు విషయం తెలియజేశారు. ఆపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేడీపేట హరికృష్ట హైస్కూల్ కు వచ్చి సీసీ కెమెరాను పరిశీలించారు. అందులో మెమొరీ కార్డు లేదని, ఎటువంటి దృశ్యాలు రికార్డు కాలేదని నిర్దారించారు.
కొయ్యూరు సీఐ ఉదయ్ కుమార్ కూడా గురువారం రాత్రి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని, విద్యార్థినులు ఆందోళన చెందవద్దని తెలిపారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications