ఏపీపై కేంద్రం దృష్టి పెట్టకుంటే ప్రజల ప్రాణాలు గాల్లోనే : మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు
కరోనా వైరస్ దేశంలో తీవ్రంగా మారుతున్న నేపధ్యంలో దేశం షట్ డౌన్ అయ్యింది . ఇక కరోనా ప్రబలుతున్న దృష్ట్యా దానిని కంట్రోల్ చెయ్యటం కోసం తెలుగు రాష్ట్రాల్లోనూ సీఎంలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక ఇప్పుడు జగన్ తీసుకున్న నిర్ణయంపై టీడీపీ నేతల నుండి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇక టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు కరోనా విషయంలో జగన్ సర్కార్ తీరును తప్పు పట్టారు.
జగన్ గారిది క్రూరమైన మనస్తత్వం అని అయ్యన్న పాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు . కావాలనే ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి అడ్డదారిలో స్థానిక సంస్థలు కైవసం చేసుకోవడానికి జగన్ ప్రయత్నం చేశారని చెప్పారు. ఇక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన జగన్ కరోనా ప్రభావం ఏపీ పై లేదని తప్పు దారి పట్టించే యత్నం చేశారని మండిపడ్డారు.కరోనా ప్రభావం లేదు అని సుప్రీంకోర్టుని కూడా తప్పుదోవ పట్టించాలని చూశారని విమర్శలు గుప్పించారు.

ఇక కరోనా ప్రభావంతో ఎన్నికలను వాయిదా వేస్తే ఆఖరికి సీఎస్ ని బెదిరించి బలవంతంగా కరోనా లేదు అంటూ లేఖ రాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టులో మొట్టికాయి పడ్డాక నిజాలు బయటపెట్టారని వ్యాఖ్యానించారు అయ్యన్న పాత్రుడు . ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా ని అరికట్టే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని పేర్కొన్నారు. ఇప్పుడు పరిస్థితి ఇలా ఉంటె కరోనా ఎఫెక్ట్ లేదని జగన్ వ్యాఖ్యానించటం దారుణం అని పేర్కొన్నారు. ఇక కేంద్రం ఏపీలో జరుగుతున్న పరిణామాలపై దృష్టి పెట్టక పోతే ప్రజల ప్రాణాలు జగన్ గాల్లో కలిపేయడం ఖాయం అని అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యానించారు.
-
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
మార్కాపురం బస్సు ప్రమాద బాధితుల కోసం ప్రధాని కీలక ప్రకటన..!! -
సంక్షోభం వస్తే మీ సన్నద్ధత ఎంత ? సీఎంల భేటీలో ప్రధాని మోడీ..! -
PM Modi: సీఎంలకు మోడీ సందేశం ఇదే..! మళ్లీ ఆ కోవిడ్ మోడల్..! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక












Click it and Unblock the Notifications