ఏపీకి అండగా కేంద్రం: శివరాజ్ సింగ్ చౌహాన్, చంద్రబాబుపై ప్రశంసలు
అమరావతి: ఇటీవల కురిసిన భారీ వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కేంద్రం అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. విజయవాడలో వరద ముంపుతో నష్టపోయిన ప్రాంతాలను ఆయన పరిశీలించారు. ఈ క్రమంలో ప్రజల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వరద విపత్తుపై కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను తిలకించారు.
వరద నష్టాన్ని ఫొటో ఎగ్జిబిషన్ ద్వారా కేంద్రమంత్రికి సీఎం చంద్రబాబు వివరించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు లోకేష్, అనిత, నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు పాల్లొన్నారు. కాగా, బుడమేరు గండ్లు పూడ్చేందుకు ఆర్మీని పిలుస్తున్నామని కేంద్ర మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ తెలిపారు.

ఫొటో ఎగ్జిబిషన్ అనంతరం కేంద్రమంత్రి శివరాజ్ సింగ్.. చంద్రబాబు, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరితో కలిసి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో సంభవించిన వరదల గురించి ప్రధాని మోడీకి వివరిస్తానని తెలిపారు. అంతే కాకుండా త్వరగా కేంద్ర సాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. కేంద్ర కమిటీ నివేదిక చూశాక, ఆర్థిక సాయం అందుతుందని ఇలాంటి కష్టసమయంలో రాష్ట్రానికి కేంద్రం అండగా ఉంటుందని శివరాజ్సింగ్ స్పష్టం చేశారు.
आज आंध्र प्रदेश के विजयवाड़ा में भारी बारिश के कारण क्षतिग्रस्त हुए प्रकाशम बैराज का निरीक्षण कर स्थिति की जानकारी ली। pic.twitter.com/BAMvetqa8f
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) September 5, 2024
కాగా, గత ప్రభుత్వ హయాంలో బుడమేరు వద్ద ఆక్రమణలు పెరిగాయని కేంద్ర మంత్రి శివరాజ్సింగ్ మండిపడ్డారు. ప్రజలు ఐదు రోజులపాటు వరదనీటిలో ఉండిపోయారని వారి ప్రాణాలు కాపాడేందుకు సీఎం చంద్రబాబు ఎంతో కృషి చేశారని కొనియాడారు. దగ్గరుండి మరీ సహాయ కార్యక్రమాలు సీఎం చంద్రబాబు పర్యవేక్షించారని ప్రశంసించారు. వరద ప్రాంతాల్లో ప్రతి ఒక్కరూ సహాయ కార్యక్రమాలు బాగా చేశారని అభినందించారు. డ్రోన్ల ద్వారా ఫుడ్ ప్యాకెట్లు అందించడం దేశంలోనే తొలిసారని కేంద్రమంత్రి చెప్పారు. తాగునీరు, పారిశుద్ధ్య కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని కేంద్రమంత్రి శివరాజ్సింగ్ తెలిపారు.
आदरणीय प्रधानमंत्री श्री @narendramodi जी के निर्देश पर आज आंध्र प्रदेश के विजयवाड़ा सहित अन्य बाढ़ प्रभावित क्षेत्रों का दौरा किया।
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) September 5, 2024
इस दौरान मेरे सहयोगी राज्यमंत्री श्री @PemmasaniOnX जी, आंध्र प्रदेश सरकार में मंत्री श्री @naralokesh जी और @BJP4Andhra की प्रदेश अध्यक्ष बहन… pic.twitter.com/YjQ6d8kfbP
వరదల నేపథ్యంలో సీఎం చంద్రబాబు కలెక్టరేటునే సెక్రటేరీయేట్ చేసుకుని చంద్రబాబు.. ఆయన బృందం 24 గంటలూ పని చేశారని కేంద్ర మంత్రి కొనియాడారు. కాగా, ప్రకాశం బ్యారేజీ సామర్థ్యంపై అమిత్షా, నిపుణులతో చర్చిస్తామని శివరాజ్సింగ్ చెప్పారు. బుడమేరు సమీపంలో అక్రమ మైనింగ్ జరపడం వల్ల కూడా ఇబ్బందులు వస్తున్నట్లు తెలిసిందని తెలిపారు. కృష్ణా నది, బుడమేరు రెండూ ఒకే సారి పొంగాయని దీంతో గతంలో ఎన్నడూ చూడని జల ప్రళయాన్ని ఇప్పుడు విజయవాడ చూడాల్సి వచ్చిందన్నారు.
आंध्र प्रदेश के विजयवाड़ा के जक्कमपुडी में बाढ़ प्रभावित क्षेत्रों का दौरा किया। साथ ही पीड़ित लोगों से मिलकर ढांढस बंधाया उनका दुःख बांटा।
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) September 5, 2024
संकट की इस घड़ी में पूरा देश आंध्र प्रदेश के साथ खड़ा है। स्थिति को सामान्य बनाने तथा पीड़ितों को राहत उपलब्ध कराने के लिए केंद्र और राज्य… pic.twitter.com/H9kWiRwVuJ
మరోవైపు, ప్రకాశం బ్యారేజ్కు 15 లక్షల క్యూసెక్కులు వచ్చినా తట్టుకునేలా చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇంకా బ్యారేజ్ సామర్థ్యం పెంచేందుకు అధ్యయనం చేస్తున్నామన్నారు. బుడమేరు గండ్లు పూడ్చేందుకు ఆర్మీ రంగంలోకి దిగుతోందని, శుక్రవారం నుంచి పనుల్లో పాల్గొంటుందని చంద్రబాబు తెలిపారు. కృష్ణా నది కరకట్టలు మరింత పటిష్టం చేస్తామన్నారు సీఎం చంద్రబాబు. వర్షాలు, వరదలతో నష్టపోయిన వారందరినీ ఆదుకుంటామని చెప్పారు. సహాయక చర్యలు కొనసాగుతాయన్నారు.
-
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications