బ్యాంక్ మేనేజర్ హత్య: దోపిడీ దొంగల బీభత్సం
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా తేటగుంట దగ్గర సెంట్రల్బ్యాంకు మేనేజరు ఆంజనేయులును గుర్తుతెలియని వ్యక్తులు హతమార్చారు. విశాఖ అడ్డరోడ్డులో ఉన్న సెంట్రల్ బ్యాంకు మేనేజరుగా పనిచేస్తున్న ఆంజనేయులును దుండుగులు హత్య చేశారు.
అనంతరం, మృతదేహానికి సెక్యూరిటీ డ్రెస్ వేసి తేటగుంట దగ్గర రోడ్డుపై పడేశారు. ఈ సంఘటనపై పోలీసులు రంగప్రవేశం చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి కేసును దర్యాప్తు చేస్తున్నారు.

కర్నూలు జిల్లా డోన్ పట్టణంలోని శ్రీరామ్నగర్లోని ఓ ఇంట్లో చోరీ జరిగింది. దొంగలు నాలుగున్నర తులాల బంగారం, రెండుకిలోల వెండిని అపహరించారు.
ప్రకాశం జిల్లా పొదిలి మండలం కుంచేపలిల్లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. వాహనాల షోరూం మేనేజరు విజయ్కుమార్పై దుండుగులు దాడి చేసి, డీజిల్ పోసి నిప్పంటించారు. దొంగలు ఆయన వద్ద నుంచి రూ. 37 వేలను దోచుకున్నారు. విజయ్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. విజయ్ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.












Click it and Unblock the Notifications