పోలవరానికి రూ.1400 కోట్లు...మంజూరు చేసిన కేంద్రం
అమరావతి: నిధుల లేమితో సతమతమవుతున్న ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం తాజా నిర్ణయం కొంత ఊరట నిచ్చింది. ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుకు నాబార్డు ద్వారా రూ. 1400 కోట్లు మంజూరు చేసేందుకు కేంద్ర ఆర్థిక శాఖ అనుమతించింది.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ. 1795 కోట్ల రుణం ఇవ్వాల్సిందిగా ఎపి ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. దీనిపై స్పందించిన కేంద్రం...నాబార్డు ద్వారా రూ. 1400 కోట్ల రూపాయల రుణం మంజూరుకు అనుమతించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ, కేంద్ర జలవనరుల శాఖకు కేంద్రం నుంచి సమాచారం అందినట్లు తెలిసింది.

అలాగే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఆడిట్లు వచ్చిన తరువాత ఎపి ప్రభుత్వం కోరిన విధంగానే మరో రూ. 300 కోట్లు మంజూరు చేయనున్నట్లు ఆర్థిక శాఖ తెలిపింది. గతంలో పోలవరం ప్రాజెక్టుకు నాబార్డు నుంచి రెండు విడతల్లో రూ.1000 కోట్ల చొప్పున నిధులు విడుదల చేయడం గమనార్హం. మంగళవారం అసెంబ్లీలో సిఎం చంద్రబాబు ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ..."పోలవరం ప్రాజెక్టు విషయంలో ఎవరైనా చేతులు పెట్టాలంటే వారి చేతులు కాలిపోతాయే తప్ప...ఎవరూ ఏమీ చేయలేరు...'' అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
-
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు












Click it and Unblock the Notifications