పునీతులయ్యారు: సెంట్రల్ జైలు ఖైదీలకూ పుష్కర భాగ్యం
తూర్పుగోదావరి: గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రి కేంద్ర కారాగారంలోని సుమారు 1500 మంది ఖైదీలు పుష్కర స్నానం చేసి పునీతులయ్యారు. అయితే వాళ్లందరూ గోదావరి నదికి వెళ్లి స్నానమాచరించలేదు.
గోదావరికి తీసుకొచ్చి స్నానం చేయించడం పోలీసులకు తలకు మించిన భారం కావడంతో.. గోదావరి నీటిని తెచ్చి ఖైదీలపై చల్లారు. దీంతో పుష్కర స్నానం చేయాలన్న ఖైదీల కోరిక నెరవేరినట్లయింది.

వివరాల్లోకి వెళితే.. తాము కూడా గోదావరి పుష్కర స్నానం చేసి పునీతులు కావాలని ఖైదీలు నిర్ణయించుకున్నారు. దీనిపై వెంటనే జైలు అధికారులకు ఓ వినతిపత్రం ఇచ్చారు. 500 మంది మహిళా ఖైదీలతో సహా సుమారు 1500 మంది ఖైదీలు తమకు పుష్కర స్నాన పుణ్యం ప్రసాదించమంటూ అర్జీ పెట్టుకున్నారు.
అయితే వీరందరికీ భద్రత కల్పించడం కష్టమనే కారణంతో జైలు అధికారులు అనుమతిని నిరాకరించారు. కాగా, ఈ అంశంపై అహోబిలం మఠం వారు స్పందించారు. పవిత్ర గోదావరి జలాలను తీసుకొచ్చి ఖైదీల మీద చల్లారు.
ఇలా ఆ ఖైదీలంతా మహా పుష్కరాల్లో స్నానం చేసిన పుణ్య ఫలాన్ని పొందారు. కేవలం భద్రతా కారణాల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని జైలు సూపరింటెండెంట్ వరప్రసాద్ చెప్పారు.
-
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications