Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సంజయ్ టీం అవుట్, కిషన్ రెడ్డికి డబుల్ ధమాకా - అల్టిమేటం..!!

తెలంగాణ బీజేపీలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. పార్టీ అధ్యక్ష పదవికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేరు దాదాపు ఖరారైంది. బండి సంజయ్ కు సముచిత ప్రాధాన్యత ఇస్తామని అగ్ర నేతలు చెబుతు న్నారు. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగానే ఉంటూ పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నారు. బండిని మార్చటం పైన ఆయన మద్దతు దారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బండి సంజయ్ పై సదాభిప్రాయంతో ఉన్న ప్రధాని మోదీ నిర్ణయం ఇప్పుడు కీలకం కానుంది. ఇదే సమయంలో లక్ష్మణ్ కు పిలుపు రావటం కీలకంగా మారుతోంది.

తెలంగాణ బీజేపీలో మార్పుు
తెలంగాణ బీజేపీలో కీలక మార్పులకు నాయకత్వం సిద్దమైంది. పార్టీ బాధ్యతలు బండి సంజయ్ స్థానంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి అప్పగించేందుకు సిద్దమైంది. బండి సంజయ్ పైన ఫిర్యాదులు.. పార్టీ నేతల మధ్య విభేదాలు..మూడేళ్ల పదవీ కాలం ముగింపు వంటి కారణాలతో బండిని మార్చాలని ఆలోచన చేస్తున్నారు. బండి సంజయ్ కు కేంద్ర కేబినెట్ లోకి లేదా పార్టీ జాతీయ కార్యవర్గంలో సముచిత ప్రాధాన్యత ఇస్తామని పార్టీ నేతలు చెబుతున్నట్లు సమాచారం.

Kishan reddy

కిషన్ రెడ్డి తాను మళ్లీ పార్టీ బాధ్యతలు చేపట్టలేనని ఆయన అమిత్‌ షాకు చెప్పినట్లు తెలిసింది. అయినా కిషన్ రెడ్డి వైపే పార్టీ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. తెలంగాణ పార్టీ పైన నిర్ణయాలను ప్రధాని తీసుకుంటారని పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు. ఈ సమయంలో పార్టీ నాయకత్వం కొత్త ఫార్ముల తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.

బాధ్యతల కేటాయింపు
కిషన్ రెడ్డి పార్టీ పగ్గాలు..బండి సంజయ్ కు కేంద్ర మంత్రి వర్గంలో స్థానం..కాదనుకుంటే పార్టీ జాతీయ కార్యవర్గంలో ప్రాధాన్యత ఇస్తూ..సీనియర్‌ నేత లక్ష్మణ్‌కు కేంద్ర మంత్రి పదవి లభించే అవకాశాలున్నాయి. ఈనేపథ్యంలోనే.. శనివారం జరిగే రాష్ట్రాల మోర్చాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల సమావేశంలో పాల్గొనేందుకు వస్తున్న లక్ష్మణ్‌ను మరో 2-3 రోజులు ఢిల్లీలో ఉండాల్సిందిగా పార్టీ నేతలు ఆదేశించారు.

Kishan reddy

ఇదే సమయంలో ఈటల రాజేందర్‌కు పార్టీ ప్రచార కమిటీ, కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డికి మేనిఫెస్టో కమిటీ సారథ్యం అప్పగిస్తారని చర్చ జరుగుతోంది. అయితే, తెలంగాణలో పార్టీకి ఊపు తీసుకొచ్చిన బండి సంజయ్ ను ఎన్నికల సమయంలో తప్పిస్తే పెను సంక్షోభం తప్పదని పలువురు సీనియర్‌ నాయకులు జాతీయ నాయకత్వానికి తేల్చిచెప్పారు. ఇదే విషయమై వారు పార్టీ జాతీయ నాయకత్వానికి లేఖ రాశారు.

ప్రధానిదే తుది నిర్ణయం
బండి అధ్యక్షుడు అయిన తరువాత పార్టీ వరుసగా గెలుస్తూ వచ్చిందని.. కీలకమైన అసెంబ్లీ ఎన్నికల సమయంలో మార్పు సమర్దనీయం కాదని ఆ లేఖలో స్పష్టం చేసారు. సంజయ్‌ నాయకత్వంలోనే ఎన్నికలకు వెళతామని పదేపదే ప్రకటించి.. ఇప్పుడు అందుకు భిన్నమైన వైఖరి అనుసరిస్తే ఎంత వరకు విశ్వసనీయత ఉంటుందని నిలదీసారు.

Kishan reddy

సారథ్య మార్పు జరిగితే ఇతర పార్టీల నుంచి వచ్చే వారి సంగతేమోగానీ, పార్టీలో ఉన్నవాళ్లు కూడా ప్రత్యామ్నాయం చూసుకుంటారు. తమ నియోజకవర్గాల్లో గట్టి పట్టున్న ఆరుగురు కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యేలు తిరిగి అదే పార్టీలోకి వెళ్లడం ఖాయమని అధినాయకత్వానికి స్పష్టం చేస్తూ సీనియర్‌ నేత విజయరామారావు లేఖ రాశారు. తాజా పరిణామాలపైన బండి సంజయ్ అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మొత్తం పరిణామాలపైన.. బండి సంజయ్ పని తీరును పలు సందర్భాల్లో ప్రశంసించిన ప్రధాని మోదీ ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+