అమరావతి రాజధాని అనే ఎయిమ్స్ ఇచ్చాం-ఇప్పుడు ! కేంద్రమంత్రి వ్యాఖ్యలు
ఏపీలో అమరావతి రాజధాని వర్సెస్ మూడు రాజధానుల వ్యవహారం కాకరేపుతోంది. అమరావతికి మద్దతుగా రైతులు పాదయాత్ర చేపట్టగా.. మూడు రాజధానులకు మద్దతుగా ప్రభుత్వం రేపు ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి నారాయణ స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇప్పటికే అమరావతికి మద్దతుగా బీజేపీ నేతలు పోరు మొదలుపెట్టారు. కేంద్రం కూడా మూడు రాజధానులకు సహకారం అందించడం లేదు. ఈ నేపథ్యంలోనే ఏపీలో పర్యటిస్తున్న కేంద్రమంత్రులు అమరావతికి మద్దతుగా వ్యాఖ్యలు మొదలుపెట్టేశారు. ఇదే క్రమంలో ఇవాళ కేంద్రమంత్రి నారాయణస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిని రాజధానిగా అందరూ గుర్తించారని ఆయన తెలిపారు. ఎన్ని రాజధానులు పెట్టుకున్నా అమరావతిని అభివృద్ధి చేయమని జగన్ సర్కార్ కు సూచించారు.

రాజధాని అభివృద్ధికి రాష్ట్రప్రభుత్వ సహకారం అవసరమని కేంద్రమంత్రి నారాయణ స్వామి అన్నారు. అమరావతి రాజధాని కాబట్టే ఎయిమ్స్ కేటాయించామని ఆయన గుర్తుచేసారు. వివాదాస్పద నిర్ణయాలతో అభివృద్ధి ఆగకూడదని నారాయణ స్వామి సూచించారు. తద్వారా మూడు రాజధానుల నిర్ణయం వివాదాస్పదమనే భావన వచ్చేలా కేంద్రమంత్రి వ్యాఖ్యలు ఉన్నట్లు తెలుస్తోంది. అసలే కేంద్రంలో బీజేపీకి వైసీపీ నుంచి ఎంత సహకారం లభిస్తున్నా బీజేపీ మాత్రం టీడీపీవైపు మొగ్గుచూపుతున్న నేపథ్యంలో కేంద్రమంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
-
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!!











Click it and Unblock the Notifications