ఏపీ సర్కార్ కు మరో ఊరట-కేంద్రం నుంచి రూ.350 కోట్ల సాయం-ఆర్ధిక కష్టాల వేళ
ఏపీ ప్రభుత్వం అసలే ఆర్దిక కష్టాల్లో ఉంది. ప్రతీ రూపాయి కోసం ఎక్కని గడప లేదు దిగని గడప లేదు. ఢిల్లీ చుట్టూ ఏడాది పొడవునా ఆర్ధికమంత్రి చక్కర్లు కొడుతున్నా అప్పులు కూడా పుట్టడం లేదు. ఇలాంటి సమయంలో కేంద్రం నుంచి అందే ప్రతీ రూపాయీ కీలకంగా మారిపోయింది. దీంతో కేంద్రం ఇచ్చే నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎదురుచూస్తోంది.
గతేడాది ఏపీలో వచ్చిన వరదల కారణంగా జరిగిన నష్టానికి పరిహారం ఇచ్చేందుకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. ఏపీ సహా ఐదు రాష్ట్రాలకు వరద నష్టాల కింద పరిహారం చెల్లించేందుకు కేంద్ర హోంశాఖ తాజాగా ఆంగీకారం తెలిపింది. ఈ మేరకు ఏపీకి రూ.351.43 కోట్ల పరిహారం అందబోతోంది. 2021లో వరదలు, కొండచరియలు విరిగిపడటంతో ప్రభావితమైన ఐదు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి (ఎన్డిఆర్ఎఫ్) కింద అదనపు కేంద్ర సహాయాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి కమిటీ ఆమోదించిందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

ఐదు రాష్ట్రాలకు రూ.1,664.25 కోట్ల అదనపు కేంద్ర సహాయాన్ని కేంద్ర కమిటీ ఆమోదించింది . ఇందులో ఆంధ్రప్రదేశ్కు రూ.351.43 కోట్లు; హిమాచల్ ప్రదేశ్కు రూ.112.19 కోట్లు; కర్ణాటకకు రూ.492.39 కోట్లు, మహారాష్ట్రకు రూ.355.39 కోట్లు; తమిళనాడుకు రూ.352.85 కోట్లు, దుచ్చేరి రూ.17.86 కోట్లు ఎన్డీఆర్ఎఫ్ నుంచి చెల్లించనున్నారు. ఈ అదనపు సాయం ఇప్పటికే రాష్ట్రాలకు ఇచ్చిన స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (SDRF)లో కేంద్రం విడుదల చేసిన నిధులకు అదనం. 2021-22 ఆర్థిక సంవత్సరంలో, కేంద్ర ప్రభుత్వం 28 రాష్ట్రాలకు వారి ఎస్డిఆర్ఎఫ్లో రూ.17,747.20 కోట్లు , ఎన్డీఆర్ఎఫ్ నుండి 8 రాష్ట్రాలకు రూ.4645.92 కోట్లు విడుదల చేసింది
-
నెలకు రూ.80,500 జీతంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండానే !! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ!












Click it and Unblock the Notifications