అవిశ్వాసంతో కేంద్రం భయపడుతోంది: ఏపీ సమస్యలపై సీతారాం ఏచూరి
న్యూఢిల్లీ: అవిశ్వాసంపై చర్చించేందుకు కేంద్రం భయపడుతోందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. శుక్రవారం సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాలు ముగిశాయి. పొలిట్బ్యూరో రూపొందించిన పార్టీ సంస్థాగత ముసాయిదా నివేదికపై చర్చించారు.
నివేదికను అఖిల భారత మహాసభల్లో ప్రవేశపెట్టనున్నారు. ఏప్రిల్ 18 నుంచి 22 వరకు హైదరాబాద్లో అఖిల భారత మహాసభలు జరగనున్నాయి. ఈ సందర్భంగా సీతారాం ఏచూరి మీడియాతో మాట్లాడారు.

'రెండు వారాలుగా టీడీపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు.. కేంద్రంపై అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇస్తున్నాయి. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వనందున ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చింది. అవిశ్వాస తీర్మానాలను చర్చకు తీసుకురావడంలో కేంద్రం విఫలమైంది' అని సీతారాం ఆరోపించారు.
అంతేగాక, తప్పించుకునే ధోరణిలో కేంద్రం వ్యవహరిస్తోందని, అవిశ్వాసంపై కేంద్రం భయపడుతోందని ఆయన అన్నారు. మిగతా పార్టీలతో పాటు తాము కూడా అవిశ్వాస తీర్మానం నోటీసు ఇస్తున్నామని చెప్పారు.
చర్చ జరిగితే ఏపీకి ప్రత్యేక హోదా, హామీ సహా బీజేపీ వైఫల్యాలపై చర్చిస్తామని అన్నారు. ఫెడరల్ ఫ్రంట్పై సమావేశాల్లో చర్చించలేదని, ఎన్నికల సమయంలో చర్చిస్తామని సీతారం ఏచూరి వెల్లడించారు.
-
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!!












Click it and Unblock the Notifications