జగన్ సర్కార్పై కేంద్రం కనకవర్షం- మరో రూ.4,787 కోట్లు: తక్షణమే విడుదల
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి.. కేంద్రం కనకవర్గాన్ని కురిపిస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వంతో ఎలాంటి ఘర్షణ వైఖరికి వెళ్లకుండా తనకు కావాల్సిన పనులన్నింటినీ జగన్ చేయించుకుంటోన్నారు. నిధులను తెప్పించుకుంటోన్నారు.
రెవెన్యూ లోటు బడ్జెట్ కింద కేంద్ర ప్రభుత్వం ఇటీవలే రాష్ట్రానికి 10,461 కోట్ల రూపాయలను విడుదలను మంజూరు చేసిన విషయం తెలిసిందే. అదే సమయంలో పోలవరం ప్రాజెక్ట్ కోసం 12,911 కోట్ల రూపాయలను సైతం యుద్ధ ప్రాతిపదికన కేటాయించింది. రాష్ట్రానికి జీవనాడిగా భావించే ఈ ప్రాజెక్ట్కు కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు నిధులు మంజూరు చేయడంతో పనులు ఊపందుకున్నాయి.

అదే ఊపులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వయంగా పోలవరం నిర్మాణ పనులను పర్యవేక్షించారు. గోదావరిలో వరదల కారణంగా కాఫర్డ్యామ్ కొట్టుకుపోవడంతో ప్రాజెక్టు నిర్మాణానికి అదనంగా 2,000 కోట్ల రూపాయలను సైతం మంజూరు చేయడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. పాలనాపరమైన అనుమతులను జారీ చేసింది. ఈ 2,000 కోట్ల రూపాయలు కూడా త్వరలోనే విడుదల కానున్నాయి.

అదే సమయంలో- జగన్ సర్కార్కు కేంద్ర ప్రభుత్వం మరో బిగ్ న్యూస్ను వినిపించింది. మరో 4,787 కోట్ల రూపాయలను విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలకు పన్ను పంపిణీలో భాగంగా మూడవ విడత కింద 1,18,280 కోట్ల రూపాయలను కేంద్రం విడుదల చేయగా.. ఇందులో ఆంధ్రప్రదేశ్ వాటా 4,787 కోట్ల రూపాయలు. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన జారీ చేసింది.

రాష్ట్రాలు తమ మూల ధన కేటాయింపులను వేగవంతం చేయడానికి, అభివృద్ధి/సంక్షేమానికి సంబంధిత వ్యయాలకు అవసరమైన ఆర్థిక సహాయం చేయడానికిఈ నిధులను విడుదల చేసినట్లు తెలిపింది. ప్రాధాన్యత క్రమంలో చేపట్టిన ప్రాజెక్ట్లు, పథకాల కింద వ్యయం చేయడానికి వీలుగా జూన్ నెలకు సంబంధించిన మొత్తాన్ని అడ్వాన్స్ ఇన్స్టాల్మెంట్ కింద విడుదల చేసినట్లు వివరించింది.
రాష్ట్రాలవారీగా ఏపీ- రూ.4,787 కోట్లు, అరుణాచల్ ప్రదేశ్- రూ.2,078 కోట్లు, అస్సాం- రూ.3,700, బిహార్- 11,897 కోట్లు, ఛత్తీస్గఢ్- రూ.4,030 కోట్లు, గోవా- రూ. 457 కోట్లు, గుజరాత్- రూ. 4,114 కోట్లు, హర్యానా- రూ.1,293 కోట్లు, హిమాచల్ ప్రదేశ్- రూ. 982 కోట్లు, జార్ఖండ్- రూ. 3,912 కోట్లు, కర్ణాటక- రూ. 4,314 కోట్లు, కేరళ- రూ. 2,277 కోట్లు, మధ్యప్రదేశ్- రూ. 9,285 కోట్లు, మహారాష్ట్ర- రూ. 7,472 కోట్ల రూపాయలను కేంద్రం విడుదల చేసింది.
మణిపూర్- రూ. 847 కోట్లు, మేఘాలయా- రూ.907 కోట్లు, మిజోరం- రూ.591 కోట్లు, నాగాలాండ్- రూ. 673 కోట్లు, ఒడిశా- రూ.5,356 కోట్లు, పంజాబ్- రూ. 2,137 కోట్లు, రాజస్థాన్- 7,128 కోట్లు, సిక్కిం- రూ. 459 కోట్లు, తమిళనాడు- రూ. 4,825 కోట్లు, తెలంగాణ- రూ. 2,486 కోట్లు, త్రిపుర- రూ.837 కోట్లు, ఉత్తరప్రదేశ్- రూ. 21,218 కోట్లు, పశ్చిమ బెంగాల్- రూ. 8,898 కోట్ల రూపాయలను కేంద్రం తాజగా విడుదల చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఓ నోట్ విడుదల చేసింది.
-
వీళ్లా ఆలయ అధికారులు.. శ్రీరామనవమి నాడే "అశ్లీల నృత్యాల" బాగోతం !! -
1,01,001 బియ్యపు గింజలపై "రామ" నామం..! -
డోర్నకల్–గద్వాల్ కొత్త రైల్వే లైన్ తో పాటు రైల్వే ప్రాజెక్ట్ లపై కేంద్రం శుభవార్త! -
నెలకు రూ.80,500 జీతంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండానే !! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!!












Click it and Unblock the Notifications