ఆర్థిక అవసరాలు: ఏపీకి రూ.700 కోట్లు విడుదల చేసిన కేంద్రం
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం రూ.700 కోట్లు విడుదల చేసింది. రాష్ట్ర ఆర్థిక అవసరాల కోసం ఈ మొత్తాన్ని విడుదల చేసినట్లు ప్రకటించింది. రాష్ట్ర విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన హామీలకు లోబడి ఈ మొత్తాన్ని ఇస్తున్నట్లు ప్రకటించింది. కాగా, మంగళవారం ఈ మొత్తం రాష్ట్ర ఖజానాకు చేరింది.
వరద సాయం కోసం తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత లేఖకు స్పందించిన కేంద్రం తక్షణం రూ.940 కోట్లు విడుదల చేసిన విషయం తెలిసిందే. అంతకు ఒక్కరోజు ముందే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా రాష్ట్రానికి తక్షణం రూ.వెయ్యి కోట్లు ఇవ్వాలని కోరారు.

దీనిపై స్పందించకుండా తమిళనాడు లేఖకు తక్షణం ప్రతిస్పందించిందన్న విమర్శలు రావడంతో కేంద్రం దిద్దుబాటు చర్యలు తీసుకొంది. కేంద్ర ప్రణాళిక పథకాల కింద ఏపీకి రూ.700 కోట్లు విడుదల చేసింది.
2015-16 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రకృతి వైపరీత్య పరిహార నిధి కింద ఆంధ్రప్రదేశ్కు ఇప్పటికే రూ.330 కోట్లు విడుదల చేసినట్లు కేంద్రం పేర్కొంది. ఇప్పుడు దానికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక వెసులుబాటు కోసం రూ.700 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications