Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

స్పీకర్ గా నో ఛాన్స్ - రఘురామకు ఏం దక్కనుంది..!!

ముఖ్యమంత్రి చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మూడు పార్టీల కూటమి ప్రభుత్వంలో భాగంగా ఆచి తూచి నిర్ణయాలు అమలు చేస్తున్నారు. ప్రతీ ఎంపికలోనూ సామాజిక - ప్రాంతీయ సమీకరణాల కు ప్రాధాన్యత ఇస్తున్నారు. అందులో భాగంగా అసెంబ్లీ స్పీకర్ గా సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు పేరు ఖరారైంది. డిప్యూటీ స్పీకర్ గా జనసేనకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో, రఘురామకు దక్కే పదవి పైన చర్చ మొదలైంది.

చంద్రబాబు కసరత్తు
ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా టీడీపీ సీనియర్‌ ఎమ్మెల్యే, బీసీ నాయకుడు చింతకాయల అయ్యన్నపాత్రుడిని ముఖ్యమంత్రి చంద్రబాబు ఖరారుచేసినట్లు సమాచారం. అయ్యన్న తాజా ఎన్నికల్లో గెలవటం ద్వారా అసెంబ్లీలో అడుగు పెట్టటం ఇది ఏడోసారి. పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీలో పని చేస్తున్న అయ్యన్న 1983, 85, 94, 99, 2004, 14, 24ల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1996లో అనకాపల్లి నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఎన్టీఆర్‌, చంద్రబాబు మంత్రివర్గాల్లో పనిచేశారు. ఇటీవలి మంత్రివర్గంలో ఆయనకు అవకాశం దక్కలేదు. గత ఐదేళ్లలో మాజీ సీఎం జగన్ పైన ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు.

Chandra Babu to announce Ayyanna patrudu as Speaker key post for Raghu Rama

సీనియర్లకు ప్రాధాన్యత
ఇక, డిప్యూటీ స్పీకర్ పదవి మిత్రపక్షం జనసేనకు ఇవ్వాలని నిర్ణయించారు. ఆ పార్టీ నుంచి పంతం నానాజీ, లోకం మాధవి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. సామాజిక సమీకరణాల్లో భాగంగా లోకం మాధవికి ఇవ్వాలని భావిస్తున్నారు. అయితే, అయ్యన్న..మాధవి ఉత్తరాంధ్ర ప్రాంతం కావటంతో గోదావరి జిల్లాలకు డిప్యూటీ ఇచ్చే అంశం తెర మీదకు వచ్చింది. దీంతో..పంతం నానాజీ పేరు చర్చల్లో ఉంది. పవన్ ఈ ఎంపిక పైన తుది నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో, స్పీకర్..డిప్యూటీ స్పీకర్ దాదాపు ఖరారు కావటంతో రఘురామ రాజుకు ఏ పదవి ఇస్తారనేది చర్చగా మారింది.

Chandra Babu to announce Ayyanna patrudu as Speaker key post for Raghu Rama

రఘురామకు పదవి
చంద్రబాబు ఇప్పటికే రఘురామ విషయంలో ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్ర మంత్రివర్గంలో క్షత్రియ సామాజిక వర్గానికి ప్రాధాన్యత దక్కలేదు. దీంతో..ఈ వర్గానికి టీటీడీ బోర్డు ఛైర్మన్ పదవి అప్పగిస్తారనే అంచనాలు ఉన్నాయి. ఇందుకు అశోక్ గజపతి రాజు..రఘురామ పేర్ల పైన చర్చ సాగుతోంది. దీంతో పాటుగా రాజధాని అమరావతి వ్యవహారాల్లో రఘురామకు బాధ్యతలు ఇవ్వనున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. అదే సమయంలో ప్రాంతీయ బోర్డుల నియామకం..ఛైర్మన్ల ఖరారు పైన చర్చ సాగుతోంది. ఒకటి, రెండు రోజుల్లోనే రఘురామకు ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారనేది ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+