మహానాడు: టీడీపీ కార్యకర్త మృతి, రూ.10 లక్షలు
హైదరాబాద్: మహానాడుకు హాజరైన ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన పార్టీ కార్యకర్త చెన్నయ్య గుండెపోటుకు గురయ్యారు. ఆయనను ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కన్నుమూశారు.
ఆయనను మంత్రి శిద్ధా రాఘవ రావు, ఇతర నేతలు ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. విషయం తెలిసిన చంద్రబాబు సానుభూతి తెలిపారు. ఈ సంఘటన బుధవారం జరిగింది.
చంద్రబాబు నాయుడు గురువారం నాడు చెన్నయ్య కుటుంబ సభ్యులకు పది లక్షల రూపాయలు ఇస్తున్నట్లు చెప్పారు. ఆయన మొదటి నుండి టీడీపీ కార్యకర్తగా ఉన్నారని ప్రశంసించారు. వారి పిల్లల బాధ్యతను పార్టీ తీసుకుంటుందని చెప్పారు.
280 సినిమా పేర్లతో ఎన్టీఆర్ చిత్రం
గురువారం ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు కోటేష్.. ఎన్టీఆర్ నటించిన 280 సినిమాల పేర్లతో 13 అంగుళాల పొడవు, 11 అంగుళాల వెడల్పుతో చిత్రం రూపొందించారు.