చంద్రబాబునాయుడు సంక్రాంతి ఇక్కడే జరుపుకొంటారు
సంక్రాంతి పర్వదినాన్ని తన స్వగ్రామం నారావారిపల్లెలో జరుపుకోనున్నాడు.ఈ నెల 13వ, తేదిన బాబు నారావారిపల్లెకు బయలుదేరనున్నారు.
అమరావతి:ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంక్రాంతి పర్వదిన వేడుకలను స్వగ్రామంలో జరుపుకోనున్నారు. ప్రతి ఏటా సంక్రాంతి వేడుకలను నారావారిపల్లెల్లో జరుపుకొంటున్నారు. ఈ ఏడాది కూడ సంక్రాంతి వేడుకలను స్వగ్రామంలో జరుపుకోనున్నారు.
ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో విపక్ష నాయకుడిగా చంద్రబాబునాయుడు ఉన్న కాలం నుండి సంక్రాంతి వేడుకలను తన స్వగ్రామంలో జరుపుకొంటున్నారు. ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కూడ అప్పుడప్పుడూ గ్రామానికి వెళ్ళేవారు.
అయితే సంక్రాంతి పర్వదినానికిప్రతి ఏటా క్రమం తప్పకుడా గత ఆరేళ్ళ నుండి బాబు కుటుంబసభ్యులతో కలిసి వెళ్తున్నాడు.ఈ పర్వదిన వేడుకల్లో కుటుంబసభ్యులు ఉండేలా ప్లాన్ చేసుకొంటారు.
చంద్రబాబుతో పాటు బాలకృస్ణ కుటుంసభ్యులు కూడ ఈ పండుగ వేడుకల్లో పాల్గొంటుంటారు.ఈ నెల 13వ, తేదిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నారావారిపల్లెకు బయలుదేరుతారు. ఈ నెల 15వ, తేదివరకు అక్కడే ఉంటారు.
ఈ నెల 13వ, తేది సాయంత్రం విమానంలో రేణిగుంటకు చేరుకొంటారు. అక్కడి నుండి కారులో నారావారిపల్లెకు చేరుతారు. ఈ నెల 15వ, తేదిన సాయంత్రం రేణిగుంట నుండి ఢిల్లీకి బయలుదేరుతారు. రాత్రి అక్కడే బస చేసి 16వ, తేది తెల్లవారుజామున థావోస్ వెళ్తారు.