రాజధానిపై బాబు జోరు: సింగపూర్ ప్రతినిధులతో భేటీ
హైదరబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వేగంగా అడుగులు వేస్తున్నట్లు అనిపిస్తోంది. ఆయనతో సింగపూర్ ప్రతినిధుల బృందం సచివాలయంలో సమావేశమయ్యారు. రాజధాని మాస్టర్ప్లాన్, వేస్ట్ మేనేజ్మెంట్పై ఈ భేటీలో చర్చించారు.
రాజధాని నిర్మాణంలో ఇన్ఫ్రా, ప్లానింగ్, టౌన్ ప్లానింగ్, హౌసింగ్, ఇంటిగ్రేటెడ్, ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్ తదితర అంశాలపై సింగపూర్ ప్రభుత్వం సీఆర్డీఏకు సూచనలు ఇవ్వనుంది. వేస్ట్ మేనేజ్మెంట్పై పూర్తిగా సహకరిస్తామని సింగపూర్ బృందం చంద్రబాబుకు హామీ ఇచ్చింది. ఈ భేటీలో మంత్రి నారాయణ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
రాజధాని భవనాల నిర్మాణంపై నిపుణుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ శాఖాధికారులతోపాటు మంత్రి నారాయణ పాల్గొన్నారు. అనంతరం ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డుపై రాష్ట్ర ఆర్థికశాఖ ఉన్నతాధికారులతో చంద్ర బాబు చర్చించారు.