కష్టాల్లో ఉన్నాం, రాజధాని నిర్మించాలి: బాబు (పిక్చర్స్)
చిత్తూరు: విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేక సమస్యలు ఎదుర్కుంటోందని, రాష్ట్రం కష్టాల్లో ఉందని, 2029 నాటికి ఏపీని దేశంలోనే అగ్రస్థానంలో నిలబెడతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం అన్నారు. రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర దిశగా తీసుకెళ్లేందుకు పలు చర్యలను చేపడుతున్నామన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందేందుకు అనేక అనుకూలతలు ఉన్నాయన్నారు. చిత్తూరు జిల్లా తిరుపతిలో జరుగిన 14వ ఆర్థిక సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు.
2029 నాటికల్లా దేశంలోనే ఏపీని అగ్రస్థానంలో నిలబెడతామన్నారు. తిరుపతిలో జరుగుతున్న 14వ ఆర్థిక సంఘం సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ ఈ వివరాలను వెల్లడించారు. రాష్ట్రంలో పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు అనేక అవకాశాలు ఉన్నాయని బాబు తెలిపారు. రానున్న ఐదేళ్లలో 100 శాతం అక్షరాస్యతను సాధిస్తామని చెప్పారు. ఓడ రేవులను అభివృద్ధి పరుస్తామన్నారు. కోస్తా తీరాన్ని గేట్ వే ఆఫ్ ఇండియాగా తయారు చేస్తామన్నారు.
చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు స్వాగతం పలుకుతూ పుష్పగుచ్ఛం ఇస్తున్న ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు.
చంద్రబాబు
విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేక సమస్యలు ఎదుర్కుంటోందని, రాష్ట్రం కష్టాల్లో ఉందని, 2029 నాటికి ఏపీని దేశంలోనే అగ్రస్థానంలో నిలబెడతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం అన్నారు.
చంద్రబాబు
రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర దిశగా తీసుకెళ్లేందుకు పలు చర్యలను చేపడుతున్నామన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందేందుకు అనేక అనుకూలతలు ఉన్నాయన్నారు. చిత్తూరు జిల్లా తిరుపతిలో జరుగిన 14వ ఆర్థిక సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు.
చంద్రబాబు
2029 నాటికల్లా దేశంలోనే ఏపీని అగ్రస్థానంలో నిలబెడతామన్నారు. తిరుపతిలో జరుగుతున్న 14వ ఆర్థిక సంఘం సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ ఈ వివరాలను వెల్లడించారు.
చంద్రబాబు
రాష్ట్రంలో పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు అనేక అవకాశాలు ఉన్నాయని బాబు తెలిపారు. రానున్న ఐదేళ్లలో 100 శాతం అక్షరాస్యతను సాధిస్తామని చెప్పారు.
చంద్రబాబు
ఓడ రేవులను అభివృద్ధి పరుస్తామన్నారు. కోస్తా తీరాన్ని గేట్ వే ఆఫ్ ఇండియాగా తయారు చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు.
చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం నాడు తిరుపతిలో ఆర్థిక సంఘం అధికారులతో చేయి కలుపుతున్న దృశ్యం.
చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం నాడు చిత్తూరు జిల్లా తిరుపతిలో ఆర్థిక సంఘం సమావేశంలో మాట్లాడారు.
చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం నాడు చిత్తూరు జిల్లా తిరుపతిలో ఆర్థిక సంఘం సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వస్తున్న మంత్రులు.
చంద్రబాబు
విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేక సమస్యలు ఎదుర్కుంటోందని, రాష్ట్రం కష్టాల్లో ఉందని, 2029 నాటికి ఏపీని దేశంలోనే అగ్రస్థానంలో నిలబెడతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం అన్నారు.
ఇండస్ట్రియల్ కారిడార్, పారిశ్రామిక స్మార్ట్ సిటీల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతానికి ఏపీ రాష్ట్రానికి ఎన్నో సమస్యలు ఉన్నాయన్నారు. అయితే, వాటన్నింటినీ అధిగమిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ పదేళ్ల పాలన దారుణంగా ఉండిందన్నారు. విభజన తర్వాత అనేక సమస్యలు ఏపీ ఎదుర్కొంటోందని చెప్పారు. పర్యాటక రంగం అభివృద్ధికి అనేక వనరులు ఉన్నాయన్నారు.
అధికారుల పంపిణీ పూర్తి కాలేదని చెప్పారు. రాష్ట్రానికి రాజధాని నిర్మించాల్సి ఉందని చెప్పారు. పర్యాటకరంగ అభివృద్ధికి అనేక వనరులు, రాష్ట్రంలో ఓడరేవుల అభివృద్ధికి అవకాశాలు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకుంటామన్నారు. అభివృద్ధిలో అన్ని ప్రాంతాలను సమన్వయం చేస్తామని చెప్పారు. ఏడేళ్లలో వంద శాతం అక్షరాస్యత సాధిస్తామన్నారు. యువతలో నైపుణ్యాలను పెంపొందించే కార్యక్రమాలు చేపడతామని, స్వయం సహాయక బృందాలను కోటి వరకు పెంచడమే లక్ష్యమన్నారు.