అండగా ఉంటాం: మే డే వేడుకల్లో బాబు(పిక్చర్స్)
రాజమండ్రి: వివిధ రంగాల కార్మికులకు అన్ని విధాలా అండగా ఉంటామని ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. పేదవర్గాల్లో కార్మికులే ఎక్కువ ఉన్నారని, అలాంటి కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మే డే వేడుకలను శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది.
ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న చంద్రబాబు డ్రైవర్లకు రూ.5 లక్షల బీమా పథకాన్ని ప్రకటించారు. తమ్మిశెట్టి ధనయ్య అనే ఆటో కార్మికునికి తొలి గుర్తింపు కార్డు అందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. పథకంలో సభ్యునిగా ఉన్న డ్రైవరు మరణిస్తే అతని కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం లభిస్తుందన్నారు. 9నుంచి ఇంటర్, ఐటిఐ చదువుతున్న పిల్లలకు రూ.1200 ఉపకార వేతనం లభిస్తుందన్నారు.
సహజ మరణానికి రూ.30 వేలు, శాశ్వత వైకల్యానికి రూ.75 వేలు, పాక్షిక శాశ్వత వైకల్యానికి రూ.37.5వేలు లభిస్తాయన్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు రాష్ట్రంలో 4.5 లక్షల మంది రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారన్నారు. అసంఘటిత రంగ కార్మికులకు, డ్వాక్రా సంఘాల్లోని 90 లక్షల మంది మహిళా సభ్యులకు, గ్రామీణ విలేఖర్లకూ రూ.5 లక్షల బీమా పథకాన్ని వర్తింప చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.
డ్వాక్రా మహిళలకు మండలాల్లో ఒకటి, పట్టణాలు, నగరాల్లో 40నుండి 50 జనరిక్ మందుల దుకాణాలు కేటాయిస్తామని ప్రకటించారు. మహిళా సంఘాల రుణాలు మాఫీ చేస్తామని ఇంతకుముందే ప్రకటించామని, వాటితోపాటు వారి వడ్డీని కూడా ప్రభుత్వమే భరించి, మాఫీ చేస్తుందన్నారు. మహిళా పొదుపు సంఘాల సభ్యులకు ఆర్థిక లావాదేవీలు నిర్వహించడంలో శిక్షణనిప్పించి, భవిష్యత్తులో వారికి కీలక బాధ్యతలు అప్పగిస్తామన్నారు.

మే డే వేడుకలు
వివిధ రంగాల కార్మికులకు అన్ని విధాలా అండగా ఉంటామని ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.

మే డే వేడుకలు
పేదవర్గాల్లో కార్మికులే ఎక్కువ ఉన్నారని, అలాంటి కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మే డే వేడుకలను శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది.

మే డే వేడుకల్లో బాబు
ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న చంద్రబాబు డ్రైవర్లకు రూ.5 లక్షల బీమా పథకాన్ని ప్రకటించారు. తమ్మిశెట్టి ధనయ్య అనే ఆటో కార్మికునికి తొలి గుర్తింపు కార్డు అందించారు.

మే డే వేడుకల్లో బాబు
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. పథకంలో సభ్యునిగా ఉన్న డ్రైవరు మరణిస్తే అతని కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం లభిస్తుందన్నారు.

మే డే వేడుకల్లో బాబు
9నుంచి ఇంటర్, ఐటిఐ చదువుతున్న పిల్లలకు రూ.1200 ఉపకార వేతనం లభిస్తుందన్నారు.

మే డే వేడుకల్లో బాబు
అసంఘటిత రంగ కార్మికులకు, డ్వాక్రా సంఘాల్లోని 90 లక్షల మంది మహిళా సభ్యులకు, గ్రామీణ విలేఖర్లకూ రూ.5 లక్షల బీమా పథకాన్ని వర్తింప చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.
గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు తయారుచేసిన ఉత్పత్తులకు ఆన్లైన్ మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తామన్నారు. కాపులను బీసీల్లో చేర్చాలనే నిర్ణయానికి కట్టుబడి ఉన్నామన్నారు. ఆ సామాజిక వర్గం అభివృద్ధికి ఇప్పటికే రూ.100 కోట్లు కేటాయించామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కాపులను బీసీల్లో చేర్చడంవల్ల ఇతర వెనుకబడిన తరగతుల వారికి ఎలాంటి నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు.
రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి తాను పడుతున్న కష్టానికి కార్మికులు కూడా సహకరించాలని చంద్రబాబు కోరారు. తాను రోజుకు ఐదు గంటలు కూడా నిద్రపోవడంలేదని, రాష్ట్రంలోని ఐదు కోట్లమంది ప్రజల భవిష్యత్తు కోసం తాను కష్టపడుతున్నానన్నారు. ప్రతి కార్మికుడు ఇంటికి వెళ్లిన తర్వాత ఈ రాష్ట్రం కోసం కష్టపడుతున్న ముఖ్యమంత్రికి ఎలా సహకరించాలని ఆలోచించాలన్నారు.
-
అవార్డుల గురించి చంద్రబాబుకు పాఠాలు చెప్పిన చిరంజీవి... విన్నారా? -
తెలుగు ప్రజలకు సీఎం చంద్రబాబు, రేవంత్రెడ్డి "ఉగాది" స్పెషల్ విషెస్ !!! -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications