భావితరాలకు చరిత్ర, సంస్కృతి అందిద్దాం: నికేతనం మ్యూజియంలో చంద్రబాబు(పిక్చర్స్)
విశాఖపట్నం: తెలుగు జాతి ఔన్నత్యాన్ని, నాగరికతను, సంస్కృతి, సాంప్రదాయాలను భావితరాలకు అందించేందుకు ‘తెలుగు సాంస్కృతిక నికేతనం' ఎంతగానో దోహదపడుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. విశాఖపట్నం కైలాసగిరిలో నిర్మించిన తెలుగు సాంస్కృతిక నికేతనం(మ్యూజియం)ను గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి జాతికి అంకితం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశాఖ పట్టణాభివృద్ధి సంస్థ(వుడా), ప్రపంచ తెలుగు సమాఖ్య సంయుక్తంగా ఈ మ్యూజియంను ఏర్పాటు చేయడంలో కీలక భూమిక పోషించాయన్నారు. ఇదే తరహాలో అమరావతిలో కూడా మరో మ్యూజియాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
తెలుగు సంస్కృతి, కళల వైభవాన్ని అందరికీ చాటి చెప్పేలా ఈ మ్యూజియంను తీర్చిదిద్దారన్నారు. తెలుగు జాతి చరిత్ర కళ్ల ముందు కనబడేలా కళాఖండాలను తీర్చిదిద్దారని కొనియాడారు. ఈ మ్యూజియం నిర్మాణానికి సహకరించిన దాతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్ఛేసిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. ఈ మ్యూజియంను తెలుగు జాతికి వెలుగునిచ్చే ప్రదర్శనగా పేర్కొన్నారు.
తెలుగు ప్రజల జీవన స్థితిగతులు, వైభవాన్ని తెలుసుకునే విధంగా సాంకేతికతను జోడించి ఈ ప్రదర్శనశాలను రూపుదిద్దారన్నారు. మానవ వనరుల శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. విశాఖ సాంస్కృతిక హబ్గా రూపుదిద్దుకోనుందన్నారు.
సంస్కృతిక నికేతనం
తెలుగు సాంస్కృతిక నికేతనంపై రూపొందించిన పుస్తకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆవిష్కరించారు.
సంస్కృతిక నికేతనం
తెలుగు జాతి ఔన్నత్యాన్ని, నాగరికతను, సంస్కృతి, సాంప్రదాయాలను భావితరాలకు అందించేందుకు ‘తెలుగు సాంస్కృతిక నికేతనం' ఎంతగానో దోహదపడుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు.
సంస్కృతిక నికేతనం
విశాఖపట్నం కైలాసగిరిలో నిర్మించిన తెలుగు సాంస్కృతిక నికేతనం(మ్యూజియం)ను గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి జాతికి అంకితం చేశారు.
సంస్కృతిక నికేతనం
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశాఖ పట్టణాభివృద్ధి సంస్థ(వుడా), ప్రపంచ తెలుగు సమాఖ్య సంయుక్తంగా ఈ మ్యూజియంను ఏర్పాటు చేయడంలో కీలక భూమిక పోషించాయన్నారు.
సంస్కృతిక నికేతనం
ఇదే తరహాలో అమరావతిలో కూడా మరో మ్యూజియాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
సంస్కృతిక నికేతనం
తెలుగు సంస్కృతి, కళల వైభవాన్ని అందరికీ చాటి చెప్పేలా ఈ మ్యూజియంను తీర్చిదిద్దారన్నారు.
సంస్కృతిక నికేతనం
తెలుగు జాతి చరిత్ర కళ్ల ముందు కనబడేలా కళాఖండాలను తీర్చిదిద్దారని కొనియాడారు. ఈ మ్యూజియం నిర్మాణానికి సహకరించిన దాతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
సంస్కృతిక నికేతనం
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్ఛేసిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. ఈ మ్యూజియంను తెలుగు జాతికి వెలుగునిచ్చే ప్రదర్శనగా పేర్కొన్నారు.
సంస్కృతిక నికేతనం
తెలుగు ప్రజల జీవన స్థితిగతులు, వైభవాన్ని తెలుసుకునే విధంగా సాంకేతికతను జోడించి ఈ ప్రదర్శనశాలను రూపుదిద్దారన్నారు.
సంస్కృతిక నికేతనం
మానవ వనరుల శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. విశాఖ సాంస్కృతిక హబ్గా రూపుదిద్దుకోనుందన్నారు.
సంస్కృతిక నికేతనం
త్వరలోనే హైదరాబాద్లోని రవీంద్రభారతి తరహాలో విశాఖ ఎంవిపి కాలనీలో ఓ మందిరాన్ని నిర్మించనున్నట్టు వెల్లడించారు.
సంస్కృతిక నికేతనం
ప్రపంచ తెలుగు సమాఖ్య అధ్యక్షురాలు ఇంద్రావతి మాట్లాడుతూ.. శాతవాహనుల కాలం నుంచి నేటి కాలం వరకు తెలుగు జాతి చరిత్రను ఈ ప్రదర్శన శాలలో తెలుసుకునే విధంగా తీర్చిదిద్దామన్నారు.
అగర్వాల్ ఆస్పత్రిని ప్రారంభించిన సిఎం
విశాఖపట్నంలో అటర్వాల్ కంటి ఆస్పత్రిని ప్రారంభించిన సిఎం చంద్రబాబునాయుడు.