విశాఖ-చెన్నైకి బుల్లెట్ ట్రైన్, బాబుకు ఫ్రీగా.. (పిక్చర్స్)
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో బుల్లెట్ రైలు ప్రవేశ పెట్టడానికి గల సాధ్యాసాధ్యాల పైన అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చైనా రైల్వే గ్రూపు ప్రతినిధి బృందం సభ్యులను గురువారం కోరారు.
చైనా రైల్వే గ్రూపు, అంతర్జాతీయ ఫైనాన్స్ కార్పోరేషన్ దక్షిణాసియా ప్రతినిధులు అసెంబ్లీ ఆవరణలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో చంద్రబాబుతో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా విశాఖపట్నం నుండి కాకినాడ, తిరుపతి మీదుగా చెన్నై వరకు బుల్లెట్ రైలు ఏర్పాటుకు గల అవకాశాలపై రెండు నెలల్లో సాధ్యాసాధ్యాల నివేదిక తయారు చేయాలని కోరారు.
టీసీఎస్ సీఈవో అండ్ ఎండీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో టీసీఎస్ సీఈవో అండ్ ఎండీ ఎన్ చంద్రశేఖర్ అసెంబ్లీ ప్రాంగణంలో గురువారం భేటీ అయ్యారు.
చైనా ప్రతినిధులు
ఇందుకోసం ప్రత్యేక లైను నిర్మించే అవకాశం ఉంది. ఈ సూచనకు చైనా ప్రతినిధి బృందం సానుకూలంగా స్పందించింది. నెల రోజుల్లోపు నివేదిక ఇస్తామని హామీ ఇచ్చింది. ఈ నివేదిక తయారు చేయడానికి దాదాపు రూ.150 కోట్ల వ్యయం కానున్నప్పటికీ, ఉచితంగా తయారు చేయడానికి అంగీకరించింది.
చైనా ప్రతినిధులు
రాష్ట్రంలోని నౌకాశ్రయాలను కలుపుతూ ఒక ప్రైట్ కారిడార్ ఏర్పాటును ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రతిపాదించారు. ఈ సమావేశంలో చైనా రైల్వే గ్రూపు ప్రతినిధులు ఝూ ఫాంగ్ యువాన్, ఎరిక్ తదితరులు పాల్గొన్నారు.
చెన్నై - విశాఖ
ఈ సందర్భంగా విశాఖపట్నం నుండి కాకినాడ, తిరుపతి మీదుగా చెన్నై వరకు బుల్లెట్ రైలు ఏర్పాటుకు గల అవకాశాలపై రెండు నెలల్లో సాధ్యాసాధ్యాల నివేదిక తయారు చేయాలని కోరారు.