పూర్వజన్మ బంధం, నేనూ ఫాలో అయ్యా: చంద్రబాబుపై ఉమాభారతి ఆసక్తికరం
న్యూఢిల్లీ: ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి ప్రశంసల వర్షం కురిపించారు. చంద్రబాబు ఫాస్ట్ట్రాక్ సీఎం అంటూ కొనియాడారు. ఏపీ నీటి ప్రాజెక్టులపై విషయమై ఆదివారం సీఎం చంద్రబాబునాయుడు కేంద్రమంత్రి ఉమాభారతితో భేటీ అయ్యారు.
అనంతరం ఉమాభారతి మీడియాతో మాట్లాడారు. మాట్లాడుతూ... చంద్రబాబు ఫాస్ట్ ట్రాక్ సీఎం అని అన్నారు. ఆయన పని చేసే విధానం తనకెంతో ఇష్టమని చెప్పారు. చంద్రబాబు అనుకున్నది సాధిస్తారని తెలిపారు.
తాను మధ్యప్రదేశ్ సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు సీఎంగా లేరని, కానీ తాను ఆయన్నే ఆదర్శంగా తీసుకున్నానని ఉమాభారతి తెలిపారు. చంద్రబాబులాగే పని చేసినట్లు చెప్పారు.

అప్పట్లో గుజరాత్ సీఎంగా ఉన్న నరేంద్ర మోడీకి కూడా చంద్రబాబు పనితీరు గురించి చెప్పినట్లు ఆమె తెలిపారు. చంద్రబాబునాయుడు తనకు సోదరుడి లాంటివారని అన్నారు.
చంద్రబాబును చూసినప్పుడల్లా తమ ఇంట్లో వ్యక్తిని చూసినట్లే అనిపిస్తుందని తెలిపారు. అంతేగాక, తమ ఇద్దరి నడుమ పూర్వజన్మలో ఏదో అనుబంధం ఉన్నట్లుగా ఉందని ఉమాభారతి చెప్పారు.
కాగా, ఈ భేటీలో పోలవరం ప్రాజెక్టుపై కేంద్రమంత్రితో చంద్రబాబు చర్చించారు. పోలవరాన్ని పూర్తి చేసేందుకు మరిన్ని నిధులు అవసరమవుతాయని చెప్పారు. 2018లోగా పోలవరాన్ని పూర్తి చేసేందుకు కేంద్రప్రభుత్వం అన్నివిధాలా సాయపడుతుందని కేంద్రమంత్రి హామీ ఇచ్చినట్లు తెలిసింది.
-
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు












Click it and Unblock the Notifications