తిరిగేందుకు చంద్రబాబుకు బుల్లెట్ ప్రూఫ్ బస్సు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో జిల్లాల పర్యటన కోసం ప్రత్యేక బస్సును ఉపయోగించనున్నారు. బుల్లెట్ ప్రూఫ్ బస్సును ఆయన తన పర్యటనలలో వినియోగిస్తారు.
చంద్రబాబు జిల్లా పర్యటనలకు వెళ్లినప్పుడు మంత్రులు, ప్రజాప్రతినిధులు అందరు కలిసి ఒకే వాహనంలో ప్రయాణం చేసేందుకు వీలుగా బుల్లెట్ ప్రూఫ్తో కూడిన బస్సును కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం శనివారం నాడు నిర్ణయించింది.
రూ.5.25 కోట్లతో ఈ బస్సును కొనుగోలు చేస్తారు. నీరు - చెట్టు కార్యక్రమాల్లో భాగంగా ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించే సమయంలో ఈ బస్సులోనే చంద్రబాబు బస చేసే అవకాశముంది. దీనిని మరో నెలలో తీసుకు వచ్చే అవకాశముంది.
చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం నాడు పోలవరం ప్రాంతంలో నీరు - చెట్టు కార్యక్రమంలో పాల్గొన్నారు.
చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం నాడు పోలవరం ప్రాంతంలో నీరు - చెట్టు కార్యక్రమంలో పాల్గొని, గడ్డపార పట్టిన దృశ్యం.
చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం నాడు పోలవరం ప్రాంతంలో నీరు - చెట్టు కార్యక్రమంలో పాల్గొన్నారు. పక్కన మంత్రులు, అధికారులు.
చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం నాడు పోలవరం ప్రాంతంలో నీరు - చెట్టు కార్యక్రమంలో పాల్గొని, జేసీబీ నడుపుతున్న దృశ్యం.