వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అప్పుడు రాక్షసులు.. ఇప్పుడు జగన్: చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు

ప్రతిష్ఠాత్మక పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ప్రతిపక్ష నేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పని ఇక అంతేనని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు.

|
Google Oneindia TeluguNews

విజయవాడ: ఏపీ సీఎం చంద్రబాబునాయుడు.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రతిష్ఠాత్మక పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ప్రతిపక్ష నేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పని ఇక అంతేనని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

పోలవరం నిర్మాణాన్ని, ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను అడ్డుకోకుంటే తనకిక భవిష్యత్తు ఉండదన్న భావనతోనే ఆయన ప్రతీ విషయాన్ని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారని అన్నారు. పోలవరం వెళ్లి అక్కడి గిరిజనులను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రాజెక్టుల నుంచి పరిశ్రమల వరకు అన్నింటినీ అడ్డుకోవడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు.

Chandrababu Naidu lashes out at YS Jagan

చరిత్రలోనూ రాక్షసులు ఉన్నారని, మంచి కోసం యజ్ఞాలు చేస్తుంటే అడ్డుకున్నారంటూ పరోక్షంగా జగన్‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పోలవరం నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం రూ.28 వేల కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు.

ఈ విషయం జగన్‌కూ తెలుసని, అయినా ప్రత్యేక ప్యాకేజీ డబ్బులు తీసుకోవద్దని అంటున్నారని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు వస్తాయని జగన్ ఊదరగొడతారని, వచ్చిన పరిశ్రమలు, పోర్టులను మాత్రం అడ్డుకుంటున్నారని చంద్రబాబు విమర్శించారు.

English summary
Andhra Pradesh CM Chandrababu Naidu lashed out at YSR Congress Party president Jaganmohan Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X