బెజవాడ ఘటనపై జగన్ దిగ్ర్భాంతి: విచారణకు ఆదేశించిన చంద్రబాబు
అమరావతి: సోమవారం ఉదయం బెజవాడలో కలకలం సృష్టించిన కల్తీ మద్యం ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు విచారణకు ఆదేశించారు. కల్తీ మద్యం సేవించి అస్వస్థతకు గురై న బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని విజయవాడ ప్రభుత్వాసుపత్రి వైద్యులకు సూచించారు.
మరోవైపు ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ బెజవాడలో కల్తీ మద్యం ఘటనపై తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు. కల్తీ మద్యం బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ ఘటనపై జ్యుడీషియల్ విచారణ జరిపించాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. బెజవాడ కృష్ణలంక స్వర్ణబార్లో మద్యం సేవించి ఆరుగురు మృతి చెందగా, మరో 15మంది అస్వస్థతకు గురయ్యారు. ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న వారిలో మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉంది.

మరోవైపు కల్తీ మద్యం సేవించి అస్వస్థతకు గురైన బాధితులను వైసీపీ నేత వంగవీటి రాధా పరామర్శించారు. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఆయన సోమవారం పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
చంద్రబాబు ఆదేశాల మేరకు కలెక్టర్ బాబు సంఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ ఘటనపై విజయవాడ సీపీ గౌతం సవాంగ్ మాట్లాడుతూ బార్లో సరైన ప్రమాణాలు పాటించక పోవడం వల్లనే ఈ ఘటన జరిగిందన్నారు.
ఈరోజు ఉదయం స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మెహాన్ రావుతో కలిసి ఆయన సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరుపుతామన్నారు. ఇప్పటికే మద్యం శాంపిల్స్ను సేకరించి ల్యాబ్కు పంపించామన్నారు. కల్తీ మద్యం ఘటనను సీరియస్గా తీసుకుంటామన్నారు.
News Alert | 5 dead & 3 in critical condition after consuming illicit liquor in Vijayawada, Andhra Pradesh pic.twitter.com/IvacNmxXOf
— The Quint (@TheQuint) December 7, 2015 6 dead, 17 serious after consuming spurious #liquor in #Vijayawada #AndhraPradesh
https://t.co/6fOajeXKu0
— dinesh akula (@dineshakula) December 7, 2015 Out of 17 admitted in GH, #Vijayawada 4 persons in serious condition shifted to #Andhra hospital and put on ventilation.
— dinesh akula (@dineshakula) December 7, 2015 











Click it and Unblock the Notifications