ఓటుకు నోటు కేసువల్లే బాబు నోరెత్తడం లేదా?: ఉండవల్లి
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతి చిన్న విషయానికి ముసుగు కప్పే ప్రయత్నం చేస్తున్నారని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆరోపించారు.
రాజమండ్రి:ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతి చిన్న విషయానికి ముసుగు కప్పే ప్రయత్నం చేస్తున్నారని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆరోపించారు.
అసెంబ్లీలోకి వర్షపునీరు లీకేజీ వ్యవహరాన్ని కవర్ చేసేందుకు మీడియాకు అనుమతించకపోవడం దారుణమన్నారు. చంద్రబాబునాయుడు టిడిపిలో సీనియర్ అంటూ చెప్పుకొంటున్నారని చెప్పారు.
టిడిపిలో ఆయన కంటే మాజీ మంత్రి బుచ్చయ్య చౌదరి సీనియర్ అని ఆయన గుర్తుచేశారు. చంద్రబాబులో ఏర్పడిన అత్మన్యూన్యత భావం రాష్ట్రానికి ప్రమాదమన్నారు అరుణ్ కుమార్ .

రాహుల్ గాంధీ గుంటూరుకు వస్తే టీడిపి నాయకులు నిరసన వ్యక్తం చేయించడాన్ని ఉండవల్లి తప్పుబట్టారు. విభజన జరిగినప్పుడు టిడిపి ఎంపీలు నామా నాగేశ్వర్ రావు, రమేష్ రాథోడ్ లు పార్లమెంట్ లో ఉన్నారని ఆయన గుర్తుచేశారు.
రాష్ట్ర విభజన సమయంలో నోరెత్తని చంద్రబాబునాయుడు రాహుల్ ఏపీకి వచ్చినప్పుడు నిరసన వ్యక్తం చేయడాన్ని ఏమనాలని ఆయన ప్రశ్నించారు. రూ.4 వేల కోట్లు విద్యుత్ బకాయిలు తెలంగాణ నుండి రావాల్సి ఉన్నా ఇప్పటివరకు నోరెత్తకపోవడానికి కారణం ఓటుకు నోటు కేసేనా అని ఆయన నిలదీశారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications