విభేదాలు: ఉద్వాసన తప్పదన్న చంద్రబాబు(ఫోటోలు)
విశాఖపట్నం: విశాఖపట్నంకు చెందిన ఎంపీలు చింతకాయల అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావులకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఒక రోజు పర్యటన నిమిత్తం బుధవారం విశాఖ వచ్చిన చంద్రబాబు పోర్టు కళావాణి ఆడిటోరియంలో విశాఖ రూరల్, అర్బన్ జిల్లా తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విభేదాలకు స్వస్తి చెప్పకపోతే ఉద్వాసన తప్పదని హెచ్చరించారు. కార్యకర్తలను లెక్కచేయని నాయకులను తాను కూడా ఉపేక్షించబోనని స్పష్టం చేశారు. పార్టీ ఆలోచనలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన సూచించారు.
విశాఖను స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయాలంటే, ప్రజల సహకారం తప్పనిసరని ఆయన పేర్కొన్నారు. విబేధాలు పక్కన బెట్టి పనిచేయాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు సూచించారు. విశాఖ జిల్లాలో గంటా, అయ్యన్న కలిసి పనిచేయకపోవడం వల్ల పార్టీ తీవ్రంగా నష్టపోతోందని పార్టీ అర్బన్ జిల్లా అధ్యక్షుడు వాసుపల్లి గణేష్కుమార్ చేసిన పరోక్ష ప్రస్తావనను పేర్కొంటూ సిఎం ఈ వ్యాఖ్యలు చేశారు.

గంటా, అయ్యన్నలకు బాబు సీరియస్ వార్నింగ్
విశాఖపట్నంకు చెందిన ఎంపీలు చింతకాయల అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావులకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గట్టి హెచ్చరికలు జారీ చేశారు.

గంటా, అయ్యన్నలకు బాబు సీరియస్ వార్నింగ్
ఒక రోజు పర్యటన నిమిత్తం బుధవారం విశాఖ వచ్చిన చంద్రబాబు పోర్టు కళావాణి ఆడిటోరియంలో విశాఖ రూరల్, అర్బన్ జిల్లా తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు.

గంటా, అయ్యన్నలకు బాబు సీరియస్ వార్నింగ్
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విభేదాలకు స్వస్తి చెప్పకపోతే ఉద్వాసన తప్పదని హెచ్చరించారు. కార్యకర్తలను లెక్కచేయని నాయకులను తాను కూడా ఉపేక్షించబోనని స్పష్టం చేశారు. పార్టీ ఆలోచనలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన సూచించారు.

గంటా, అయ్యన్నలకు బాబు సీరియస్ వార్నింగ్
కొంతమంది నాయకులు తమను తాము గొప్పగా ఊహించుకుంటూ కార్యకర్తలకు దూరం అవుతున్నారని, అది వారి అవివేకం అని అన్నారు. పార్టీ, కార్యకర్తలు, ప్రజలు లేనిదే మనం లేమన్న వాస్తవాన్ని నాయకులు గుర్తు పెట్టుకోవాలని అన్నారు.

గంటా, అయ్యన్నలకు బాబు సీరియస్ వార్నింగ్
వారు కష్టపడి పనిచేయడం వల్లే ఈ రోజున మనం అధికారంలోకి వచ్చామన్నారు. మీరు వేదికమీద కూర్చోవడం వెనుక కార్యకర్తల కష్టాలు చూడాలన్నారు. పార్టీపరంగా కార్యకర్తలకు, వారి కుటుంబాలకు మంచి చేయాలని భావించామని, ఈ బాధ్యతను యువ నాయకుడు లోకేష్ పర్యవేక్షిస్తున్నాడని చెప్పారు.

గంటా, అయ్యన్నలకు బాబు సీరియస్ వార్నింగ్
ఒక ప్రాంతీయ పార్టీకి 53 లక్షల మంది కార్యకర్తల బలం ఉండటం ప్రపంచ చరిత్రలోనే ఎక్కడా లేదన్నారు.

గంటా, అయ్యన్నలకు బాబు సీరియస్ వార్నింగ్
అయితే కార్యకర్తల సంక్షేమం తదితర అంశాల్లో తానొక్కడినే బాధ్యుడినన్న భావనతో నాయకులు ఉన్నారని, ఇది సమష్టి బాధ్యతగా గుర్తించాలన్నారు.

గంటా, అయ్యన్నలకు బాబు సీరియస్ వార్నింగ్
క్లిష్ట సమయంలో అధికార బాధ్యతలు చేపట్టిన తమపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, వారి ఆశలకు అనుగుణంగా పనిచేయకపోతే చరిత్ర హీనులుగా మిగిలిపోతామన్నారు.

గంటా, అయ్యన్నలకు బాబు సీరియస్ వార్నింగ్
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేసే సూచనలకు ప్రభుత్వపరంగా తీసుకునే నిర్ణయాల్లో ప్రాధాన్యత ఇస్తామని, పార్టీ గ్రామ, మండల, జిల్లా స్థాయి సమావేశాల్లో చేసే ప్రతిపాదనలను జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాల్లోనూ, క్యాబినెట్లోనూ చర్చిస్తామన్నారు.

గంటా, అయ్యన్నలకు బాబు సీరియస్ వార్నింగ్
అన్ని సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి గ్రామస్థాయి నుంచి వచ్చే సూచనలు అమలు చేయడం ద్వారా మంచి ఫలితాలు రాబట్టేందుకు అవకాశం ఉందన్నారు.

గంటా, అయ్యన్నలకు బాబు సీరియస్ వార్నింగ్
రెండుసార్లు అధికారంలోకి రాలేకపోయినా కార్యకర్తలు పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ఎంతో శ్రమించారన్నారు. అటువంటి కార్యకర్తలకు తాను జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పారు.

గంటా, అయ్యన్నలకు బాబు సీరియస్ వార్నింగ్
రెండుసార్లు అధికారంలోకి రాలేకపోయినా కార్యకర్తలు పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ఎంతో శ్రమించారన్నారు. అటువంటి కార్యకర్తలకు తాను జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పారు.












Click it and Unblock the Notifications