విజయవాడ సిపి గా ఎవరిని పెట్టాలి?... సిఎం చంద్రబాబు కసరత్తు
విజయవాడ:రాజధాని ప్రాంతంలో శాంతిభద్రతల విషయమై అత్యంత కీలకపాత్ర పోషించే విజయవాడ పోలీస్ కమిషనర్ నియామకానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు.
ఇదే విషయమై ఆయన ఆదివారం సీనియర్ ఐపిఎస్ అధికారులు ద్వారకాతిరుమలరావు, నళినీ ప్రభాత్, అమిత్గార్గ్లతో ఉండవల్లిలోని తన నివాసంలో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా సిఎం చంద్రబాబు వారితో పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం. గౌతమ్ సవాంగ్ విజిలెన్స్ డిజిగా వెళ్లిన తరువాత విజయవాడ పోలీస్ కమిషనర్ పదవీ ఇప్పటి వరకు ఖాళీగానే ఉంది.

రాజధాని ప్రాంతంలో ఎంతో కీలకమైన ఈ పదవి కోసం పలువురు సీనియర్ ఐపిఎస్లు పోటీ పడుతున్నారు. సిఐడి చీఫ్ ద్వారకాతిరుమలరావు, ఆపరేషన్స్ ఎడిజి నళినీ ప్రభాత్తో పాటు గతంలో విజయవాడ కమిషనర్గా చేసిన సీనియర్ సిఐడి అధికారి అమిత్గార్గ్ కూడా ఈ రేసులో ముందున్నట్లుగా తెలుస్తోంది. సిఎం చంద్రబాబు హఠాత్తుగా ఈ ముగ్గురు పోలీసు అధికారులతో సమావేశమయింది కూడా ప్రస్తుతానికి ఖాళీగా ఉన్న విజయవాడ పోలీస్ కమిషనర్ పదవి భర్తీ కోసమే అని పోలీసు వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ఈ ముగ్గురు ఐపిఎస్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ జరిగినందున ఇక అతి త్వరలోనే విజయవాడ పోలీస్ కమిషనర్ ఎంపిక ఉంటుందని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి.
-
పిడుగులు, భారీ వర్షాలు - ఏపీలో ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!!












Click it and Unblock the Notifications