Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కురుక్షేత్రానికి కౌంట్ డౌన్, ఢిల్లీలో మోదీ, ఇక్కడ మేమే, జగన్ గుండెల్లో దడ పుట్టింది, చంద్రబాబు !

భారతదేశానికి నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని అవుతారని, ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని, ఆంధ్రాలో డబుల్ ఇంజిన్ సర్కారు రావడం గ్యారెంటీ అని మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. కూటమి దెబ్బకు జగన్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని చంద్రబాబు ఆరోపించారు

తిరుపతిలో జరిగిన బహిరంగ సభలో పవన్ కల్యాణ్ తో కలిసి మాట్లాడిన మాజీ సీఎం చంద్రబాబు నాయుడు వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్, వైకాపా సర్కారుపై మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టో కళకళలాడుతోందని, వైసీపీ మేనిఫెస్టో బంగాళాఖాతంలో కలిసిపోందని, జగన్ పార్టీకి డిపాజిట్లు కూడా గల్లంతు అవుతాయని, ఢిల్లీలో మోదీ కుర్చుంటే ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం కొలువుతీరుతుందని మాజీ సీఎం చంద్రబాబు అన్నారు.

Chandrababu said that Modi will come in Delhi and coalition government in Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే ప్రజాగళం మేనిఫెస్టో, సూపర్-6 లకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని, మీ ఉత్సాహం చూస్తుంటే తనకు ఇప్పుడే పండగ వచ్చినంత ఆనందంగా ఉందని చంద్రబాబు నాయుడు చెప్పారు. జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు నెల్లూరు ఎంతో తనకు తిరుపతి అంటే అంతే అని, ఇక్కడే పుట్టి పెరిగానని, తిరుపతిలో గల్లీగల్లీలో తిరిగి తాను ఎస్ వీ యూనివర్శిటీలో విద్యార్థి సంఘం నాయకుడు అయ్యానని చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు.

తాను విద్యార్థి సంఘం నాయకుడిగా పని చేసి తరువాత రాజకీయాల్లోకి తిరుపతి నుంచి ఎంట్రీ ఇచ్చానని, ఈ రోజు మీ అశీస్సులు, వెంకటేశ్వరస్వామి ఆశీస్సులతో తాను ఇంతటి వాడిని అయ్యాయని, తాను ఈ స్థాయిలో ఉన్నానంటే అది తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి దయ, మీ ఆదరణ అని మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. తిరుపతి రుణం తీర్చుకోవడానికి తనకు త్వరలో అవకాశం వస్తుందని ఎదురు చూస్తున్నానని చంద్రబాబు చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ లో ఇదే నెల 13వ తేదీన జరిగే కురుక్షేత్ర యుద్దంలో కౌరవ వధ తప్పదని, తరువాత ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అంతా మంచే జరుగుతుందని చంద్రబాబు నాయుడు జోస్యం చెప్పారు. నేను పుట్టిన స్థానం తిరుపతి, నేను పెరిగిన స్థానం తిరుపతి, నాకు విద్యార్థి నాయకుడిగా భిక్ష పెట్టింది తిరుపతి, తనకు పునర్జన్మ ఇచ్చింది ఇదే తిరుపతి అని, పవన్ కల్యాణ్ కు కూడా తిరుపతి ఓ సెంటిమెంట్ అని, ఇప్పుడు ఇద్దరూ ఇదే తిరుపతికి వచ్చామని, ఇద్దరూ కలిసి తిరుపతి, తిరుమల పవిత్రతను కాపాడుతామని బహిరంగంగా మాట ఇస్తున్నామని చంద్రబాబు నాయుడు చెప్పారు.

Chandrababu said that Modi will come in Delhi and coalition government in Andhra Pradesh

తాను సీఎంగా ఉన్న సమయంలో ప్రతినెల రెండో మంగళవారం తిరుపతి ప్రజలు ఎలాంటి ఇబ్బంది లేకుండా తిరుమలలో శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి అవకాశం ఇచ్చామని, తరువాత వచ్చిన ధుర్మార్గులు తిరుపతి ప్రజలకు అలాంటి అవకాశం లేకుండా చేశారని, ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తిరుపతి ప్రజలకు మళ్లీ అలాంటి అవకాశం కల్పిస్తామని మాజీ సీఎం చంద్రబాబుతో పాటు పవన్ కల్యాణ్ కూడా హామీ ఇచ్చారు.

తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆగడాలు, దందాలు, వైసీపీ అరాచకాలకు అడ్డుకట్ట వేయాలంటే భూమన కుమారుడిని చిత్తుగా ఓడించాలని, కూటమి అభ్యర్థి, జనసేన పార్టీ అభ్యర్థి అరణి శ్రీనివాసులను, ఎంపీ బీజేపీ అభ్యర్థి వరప్రసాద్ రావ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ తిరుపతి ప్రజలకు మనవి చేశారు. అంతకు ముందు తిరుపతిలో జరిగిన భారీ ర్యాలీలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ కు అడుగడుగునా ప్రజలు స్వాగతం పలకడంతో టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు ఉత్సాహంతో ఉన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+