మంత్రి మాణిక్యాలరావుకు క్షమాపణలు చెప్పిన చంద్రబాబు
దేవాదాయ శాఖామంత్రి పైడికొండల మాణిక్యాలరావుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు క్షమాపణలు చెప్పారు.
విజయవాడ: దేవాదాయ శాఖామంత్రి పైడికొండల మాణిక్యాలరావుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు క్షమాపణలు చెప్పారు. ఇటీవల మాణిక్యాలరావు తల్లి మృతి చెందారు. ఆమె మృతిపట్ల సానుభూతి వ్యక్తం చేసిన చంద్రబాబు మంత్రివర్గ సమావేశానికి హాజరైన మంత్రితో మాట్లాడారు.

ఆమె చనిపోయిన సమయంలో నేరుగా పరామర్శించలేకపోయానంటూ క్షమాపణలు చెప్పారు. బిజీ షెడ్యూల్ కారణంగా రాలేకపోయానని పేర్కొన్నారు. మరోమారు ఆయనకు సానుభూతి తెలిపారు.
కాగా, దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు తల్లి రంగనాయకమ్మ(73) శనివారం(డిసెంబర్ 31న) విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మృతి చెందారు. మెదడుకు సంబంధించిన వ్యాధితో దీర్ఘకాలంగా ఆమె చికిత్స పొందుతున్నారు. శనివారం ఉదయం 10 గంటలకు ఆమె తుదిశ్వాస విడిచారు. రంగనాయకమ్మ, సుబ్బారావుల ఏకైక కుమారుడు మంత్రి మాణిక్యాలరావు.
More From
-
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్












Click it and Unblock the Notifications