అమరావతిలో ఆలస్యంపై బాబు సీరియస్, తెలంగాణ మిగులు.. ఏపీకి అప్పుగా: టీజీ
విజయవాడ: అమరావతి నిర్మాణం పనుల్లో ఆలస్యం పైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం నాడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఈ రోజు అమరావతి నిర్మాణం పైన సమీక్ష నిర్వహించారు. అసెంబ్లీ డిజైన్ల పైన సమీక్షలో చర్చించారు.
నిర్మాణ పనుల్లో జాప్యం జరుగుతోందని తెలుసుకొని మండిపడ్డారు. డిసెంబర్ నాటికి పూర్తి కావాల్సిన సీడ్ యాక్సిస్ రోడ్డు పనులు ఇంకా కొలిక్కి రాకపోవడంపై అధికారులను నిలదీశారు. ఏడు రోడ్లకు పారదర్శకంగా టెండర్లు పిలవాలను సూచించారు.

విభజన వల్లే తెలంగాణకు మిగులు బడ్జెట్: టిజి వెంకటేష్
రాష్ట్ర విభజన వల్లనే తెలంగాణకు మిగులు బడ్జెట్ ఉందని, ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్లో ఉందని తెలుగుదేశం పార్టీ ఎంపీ టిజి వెంకటేష్ మంగళవారం అన్నారు. మిగులు బడ్జెట్ను ఏపీకి అప్పుగా ఇవ్వాలని చెప్పారు. కేంద్రం ఏపీకి ఇచ్చిన హామీలు పూర్తిగా ఇచ్చే వరకు హైదరాబాదును ఉమ్మడి రాజధానిగానే ఉంచాలన్నారు.
శ్రీవారి సేవలో గంటా
తిరుమల శ్రీవారిని మంత్రి గంటా శ్రీనివాస రావు, ఎంపీ సీఎం రమేష్లు బుధవారం ఉదయం దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ అధికారులు వారికి తీర్థప్రసాదాలు అందించారు. మండలి విపక్ష నేత సీ రామచంద్రయ్య విఐపి విరామ సమయంలో స్వామి వారి దర్శనం చేసుకున్నారు.
-
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
అమరావతిలో తొలి భారీశిల్పం,చారిత్రక స్మారకం ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
డ్రగ్స్ కేసులో ఎంపీ పుట్టా మహేష్కు స్టేషన్ బెయిల్ మంజూరు.. -
ప్రభుత్వ ఆస్పత్రులలోనూ వాట్సప్ ద్వారా ఓపీ అపాయింట్మెంట్లు.. పేదలకు చంద్రబాబు శుభవార్త! -
పీఎం కిసాన్ నిధులు జమ కాలేదా - అయితే, ఇలా చేస్తే వెంటనే..!! -
‘ఆ తప్పు వల్లే ప్రెగ్నెన్సీ.. తప్పక పెళ్లి చేసుకున్నా’ -
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్?












Click it and Unblock the Notifications