బాబు షాక్! విమానాల్లో టూర్లకు రూ.15 కోట్ల ఖర్చు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విమానయాన ఖర్చులు తడిసిమోపెడు అయ్యాయని సమాచారం. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత అనేక పర్యటనలకు ప్రత్యేక విమానాలను ఉపయోగించారు.
మరికొన్ని సందర్భాల్లో కొంతవరకు హెలికాప్టర్లో అక్కడి నుంచి ప్రత్యేక విమానాల్లో కూడా పర్యటనలు నిర్వహించారు. దాదాపు 67 పర్యటనల సందర్భగా అయిన ఖర్చు ఏకంగా 15 కోట్ల రూపాయలు దాటిపోయిందని సమాచారం. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి కార్యాలయం, సివిల్ ఏవియేషన్ అధికారులు బిల్లులు తయారుచేసి ఆర్ధిక శాఖకు పంపించారు.

ఇప్పటికే వివిధ సంస్థలకు చెల్లించాల్సిన బకాయిలు పెరిగిపోతుండడంతో వారి నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి ఎక్కువవుతోందని ఆ శాఖల అధికారులు ఆర్ధిక శాఖకు వివరించినట్లుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలోనే దాదాపు 15 కోట్ల రూపాయలను విడుదల చేసేందుకు ఆర్ధిక శాఖ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.
కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కష్టాల్లో ఉందని చెబుతున్న చంద్రబాబు ఇలా విమానయాన ఖర్చుల కోసం ఇంతలా చేయడం సరికాదని విమర్శకులు అంటున్నారు. అయితే, అభివృద్ధి చర్యల్లో భాగంగా వెళ్లవలసి వచ్చిందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..!











Click it and Unblock the Notifications