ముద్రగడ ఎఫెక్ట్: టిడిపి కాపు నేతలకు చంద్రబాబు క్లాస్?
విజయవాడ: తూర్పు గోదావరి జిల్లా తునిలో కాపు గర్జన, విధ్వంసం నేపథ్యంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘాటుగా స్పందిస్తున్నారు. తుని ఘటన నేపథ్యంలో ఇంటెలిజెన్స్ వర్గాల పైన కూడా చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి.
తాజాగా, ఆయన పశ్చిమ జిల్లాకు చెందిన కాపు ప్రజాప్రతినిధుల పైన కూడా భగ్గుమన్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇంత జరుగుతుంటే మీరంతా ఏం చేస్తున్నారని, మీ నియోజకవర్గాల నుంచే ఎక్కువ స్థాయిలో కాపులు, నేతలు తరలి వెళ్లారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి.
చంద్రబాబు మంగళవారం నాడు కాపు సామాజిక వర్గానికి చెందిన టిడిపి ప్రజాప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాజ్యసభ ఎంపీ తోట సీతారామలక్ష్మి, ఏలూరు ఎమ్మెల్యే బుజ్జి, పాలకొల్లు ఎమ్మెల్యే రామానాయుడు, నరసాపురం ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, భీమవరం ఎమ్మెల్యే రామాంజనేయులుతో మాట్లాడారు.

గతంలో కాపులను ఎవరూ పట్టించుకోలేదని, ఇప్పుడు తన హయాంలో వారికి న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నానని చంద్రబాబు వారితో చెప్పారు. మనతో పాటు కాంగ్రెస్, వైసిపిలు కూడా కాపులను బీసీల్లో చేర్చడానికి కమిషన్ వేస్తామని చెప్పాయని, ఇప్పుడు మనం అదే చేశామని చెప్పారు.
తొమ్మిది నెలలా, ముందేనా ఇప్పుడే చెప్పలేం: మంజునాథ్
విధివిధానాలు రూపొందించాక కాపులను బీసీల్లో చేర్చే అంశంపై తమ కమిషన్ పని చేస్తుందని బీసీ కమిషన్ చైర్మన్ మంజునాథ్ అన్నారు. ఆయన ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. అనంతరం మాట్లాడారు. కాపులను బీసీల్లో చేర్చే అంశంపై నివేదిక తొమ్మిది నెలల్లోనా, అంతకుముందే ఇస్తామా అనేది ఇప్పుడే చెప్పలేమన్నారు.
-
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..!












Click it and Unblock the Notifications