వివాదాస్పద విలీన మండలాల్లో చంద్రబాబు పర్యటన; వరద బాధితులకు పరామర్శ; ఆసక్తికర చర్చ!!
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జూలై 28 నేటి నుండి మరో విడత వరద పర్యటనను కొనసాగించనున్నారు. విలీన మండలాల్లో ఆయన రెండు రోజుల పాటు పర్యటించి వరద బాధితులను పరామర్శిస్తారు. గత వారం రోజుల పాటు ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించి బాధితులను కలిసి వారికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చిన చంద్రబాబు, అప్పుడే వరద ప్రభావిత విలీన మండలాల్లో పర్యటనలు చెయ్యాలని భావించారు. కానీ వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో అప్పుడు పర్యటన విరమించుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు విలీన మండలాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆసక్తికరంగా మారింది.

పోలవరం విలీన మండలాలలో చంద్రబాబు పర్యటన ... ఆసక్తికరం
పోలవరం విలీన మండలాల్లో వరద ప్రభావానికి గురైన అనేక గ్రామాల ప్రజలు తమని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, తమను తెలంగాణలో కలపాలని రోడ్డెక్కి ఆందోళనలు చేసిన పరిస్థితులలో, ఇక విలీన మండలాలపై తెలంగాణ మంత్రులు సైతం వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో చంద్రబాబు అక్కడికి వెళ్లి వరద బాధితులను పరామర్శించడం ఆసక్తికరంగా మారింది. విలీన మండలాలపై వివాదం నెలకొన్న నేపధ్యంలో చంద్రబాబు తాజా పర్యటన ఎలాంటి రాజకీయ పరిణామాలకు కారణం అవుతుందో అన్న చర్చ జరుగుతుంది.

చంద్రబాబు రెండు రోజుల పర్యటన షెడ్యూల్ ఇదే
ఇక చంద్రబాబు పర్యటన వివరాల్లోకి వెళితే ఉండవల్లి లో నివాసం నుండి రోడ్డు మార్గంలో వేలేరుపాడు మండలానికి చేరుకోనున్న చంద్రబాబు అక్కడ శివకాశి పురం లోని పునరావాస కేంద్రంలో బాధితులను పరామర్శిస్తారు. ఆపై కుక్కునూరు కు చేరుకుని చంద్రబాబు తెల్ల రాయి గూడెం లోని పునరావాస కాలనీ కి వెళ్లి బాధితులను పరామర్శించి వారితో మాట్లాడతారు. అక్కడ నుండి తెలంగాణ రాష్ట్రం బూర్గంపాడు, సారపాక లకు వెళ్లి వరద బాధితులను పరామర్శించి ఆపై భద్రాచలం చేరుకుంటారు. రాత్రికి భద్రాచలంలో బస చేయనున్న చంద్రబాబు శుక్రవారం ఉదయం ఎటపాక, కూనవరం, వరరామచంద్రాపురం, చింతూరు మండలాల్లో పర్యటిస్తారు.

విలీన మండలాల ప్రజల కష్టాలను ప్రభుత్వం పట్టించుకోలేదని టీడీపీ ఆరోపణలు
ఏపీ ప్రభుత్వం వరద బాధితులకు సహాయం అందించడంలో విఫలమవుతోంది అని, ప్రభుత్వ వైఫల్యం వల్లే వరదలు అనేక మండలాలను ముంచెత్తాయి తెలుగుదేశం పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఇక విలీన మండలాల ప్రజలు గతంలో విలీనం జరిగిన సమయంలో ఎటువంటి వ్యతిరేకతను వ్యక్తం చేయలేదని, ఇప్పుడు ప్రభుత్వం పట్టించుకోకపోవడంతోనే తమను తెలంగాణాలో కలపాలంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పై విలీన ప్రాంతాల ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని అభిప్రాయపడుతున్నారు. అందుకే తెలంగాణాలో కలపాలని అడుగుతున్నారని విమర్శిస్తున్నారు.

చంద్రబాబు విలీన మండలాల పర్యటన అందుకేనా .. అనుమానాలు
ఈ క్రమంలోనే చంద్రబాబు వరద ప్రభావిత ప్రాంతాలు అయిన విలీన మండలాల్లో పర్యటన ఏపీ రాజకీయాలలో ఆసక్తికరంగా మారింది. కేవలం రాజకీయంగానే చంద్రబాబు విలీన మండలాల పర్యటన సాగుతుందా అన్న అనుమానం వైసీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. కావాలనే చంద్రబాబు అక్కడికి వెళ్తున్నారని, జగన్ పై వ్యతిరేకత పెంచే ప్రయత్నం చేస్తున్నారని అనుమానిస్తున్నారు. కానీ వరద బాధితులకు భరోసా ఇవ్వటం కోసమే చంద్రబాబు పర్యటన చేస్తున్నారని చెప్తున్నారు టీడీపీ నేతలు.
-
కుమార్తెకు లోకేష్ ఊహించని పెళ్లి గిఫ్ట్ -అవాక్కైన టీడీపీ ఎమ్మెల్యే..! -
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..











Click it and Unblock the Notifications