రావెల-జానీమూన్ మధ్య రాజీ అంతేనా?: బాబు ఆగ్రహం, జగన్కు ఛాన్స్
మంత్రి రావెల కిషోర్ బాబు, జెడ్పీ చైర్ పర్సన్ జానీమూన్ల మధ్య విభేదాలు సమసిపోయినట్లు ప్రకటించినా, అవి కొనసాగుతున్నాయని తెలుస్తోంది.
గుంటూరు: మంత్రి రావెల కిషోర్ బాబు, జెడ్పీ చైర్ పర్సన్ జానీమూన్ల మధ్య విభేదాలు సమసిపోయినట్లు ప్రకటించినా, అవి కొనసాగుతున్నాయని తెలుస్తోంది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది.
నేతల విభేదాల పైన చంద్రబాబు ఆగ్రహం చల్లారలేదని అంటున్నారు. ఆదివారం సాయంత్రం గుంటూరులో విలేకరుల సమావేశంలో వివాదం సమసిపోయిందని మంత్రి రావెల, చైర్ పర్సన్ జానీమూన్ ప్రకటించారు.
కానీ చంద్రబాబు మాత్రం వారి తీరుపై సంతృప్తి చెందలేదని తెలుస్తోంది. మంత్రులు పత్తిపాటి పుల్లారావు, పల్లె రఘునాథ రెడ్డి, జిల్లా అధ్యక్షులు జీవీ ఆంజనేయులు తదితరులు చర్చలు జరిపి వారి మధ్య విభేదాలు సమసిపోయాయని ప్రకటింప చేశారు.

అయితే, వారిద్దరూ విలేకరులతో మాట్లాడడం కంటి తుడుపు రాజీగా చంద్రబాబు కొట్టిపారేసినట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరి చర్యలు తీవ్రమైన క్రమశిక్షణ రాహిత్యమని, తేలిగ్గా వదిలేది లేదని ముఖ్య నేతల వద్ద ఆయన వ్యాఖ్యానించారని తెలుస్తోంది.
ఇలాంటి ధోరణులకు ఒకేసారి ఫుల్స్టాప్ పెట్టాలన్నారు. ఈ వివాదంపై విచారణ కోసం నియమించిన త్రిసభ్య కమిటీ తన పని తాను చేయాలని, నిష్పాక్షికంగా విచారణ జరిపి వాస్తవాలతో నివేదికను ఇవ్వాలని ఆదేశించారు.
కాగా, పార్టీలోని చిన్న చిన్న విభేదాలను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పెద్దవిగా చేసి చూపించే ప్రయత్నాలు చేస్తోందని మంత్రి పత్తిపాటి విమర్శించిన విషయం తెలిసిందే. కాగా, ఇప్పుడు వారి మధ్య విభేదాలు తొలగిపోయాయనేది కంటితుడుపు చర్యే అని చంద్రబాబే భావించడం ద్వారా.. జగన్కు మళ్లీ ఛాన్స్ దొరికిందని అంటున్నారు.
-
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!












Click it and Unblock the Notifications