టీడీపీ టికెట్ ఆశావహులకు చంద్రబాబు హెచ్చరిక-నేనే ఫైనల్ చేస్తా-వచ్చేది మన ప్రభుత్వమే..
ఏపీలో ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని టార్గెట్ పెట్టుకున్న టీడీపీ ఇప్పటి నుంచే ఆ దిశగా పార్టీ నేతల్ని నడిపించేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ఈసారి టికెట్లు ఆశిస్తున్న వారికి అధినేత చంద్రబాబు ఇవాళ కీలక హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ఆయా ఆశావహులంతా తమ అవకాశాలపై మరోసారి ఆలోచించుకోవాల్సిన పరిస్ధితి ఏర్పడుతోంది.
టీడీపీ టిక్కెట్ ఆశావహులకు టీడీపీ అధినేతచంద్రబాబు నాయుడు కీలక హెచ్చరికలు చేశారు. పీలేరులో జరిగిన జిల్లా పార్టీ సమీక్షా సమావేశంలో చంద్రబాబు ఈ మేరకు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎవరు ఫీల్డ్ లో పనిచేస్తున్నారో.. ఎవరు పని చేయకుండా నా దగ్గరకు వచ్చి మాటలు చెప్తున్నారో నాకు తెలుసని చంద్రబాబు వ్యాఖ్యానించారు. మూడేళ్ల నుంచి నియోజకవర్గాల్లో ఏమి జరుగుతోందో అన్నీ ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తున్నా అని కార్యకర్తలకు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఎవరు పోటీ చేస్తారనేది తాను మాత్రమే ఫైనల్ చేస్తానన్నారు.

రాష్ట్రంలో టీడీపీ టికెట్లు ఆశిస్తున్న అందరి డేటా తన దగ్గర ఉందని చంద్రబాబు తెలిపారు. ముందు టీడీపీ పని అయిపోయిందని జగన్ సంబరపడ్డారని, ఇవాళ టీడీపీని చూసి జగన్ భయపడుతున్నారని చంద్రబాబు పేర్కొన్నారు.
రాష్ట్రంలో వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. అందరూ కలిసికట్టుగా పనిచేస్తే టీడీపీ విజయాన్ని ఎవరూ ఆపలేరన్నారు. నియోజకవర్గాల్లో ఉన్న లోపాలను సరిచేస్తానని కార్యకర్తలకు చంద్రబాబు హామీ ఇచ్చారు.
చిత్తూరు జిల్లాలో టీడీపీ పరిస్దితి నానాటికీ దయనీయంగా మారుతోంది. స్వయంగా తన కుప్పం నియోజకవర్గంలోనే వైసీపీ సత్తాచాటుతోంది. వచ్చే ఎన్నికల నాటికి పరిస్దితులు ఎలా ఉంటాయో తెలియదు. దీంతో అప్రమత్తం కాకపోతే పుట్టి మునుగుతుందని భావిస్తున్నచంద్రబాబు నేతలకు ఈ హెచ్చరికలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కుప్పంలో వైసీపీ అభ్యర్ధిని ప్రకటించడం ద్వారా తన చిరకాల ప్రత్యర్ధి పెద్దిరెడ్డి ఓ అడుగు ముందుకేశారు. దీంతో జిల్లాపై తన పట్టు పూర్తిగా కోల్పోకుండా చంద్రబాబు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
-
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్












Click it and Unblock the Notifications