వీఆర్ లో కూడా ఓవర్ యాక్షన్ చేసిన అధికారులు, తిక్కచేష్టలు వద్దని చంద్రబాబు వార్నింగ్
విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తర్వాత సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపడుతున్న కొందరు సీనియర్ అధికారులు తీరుపై సీఎం చంద్రబాబు నాయుడు ఆసహనం వ్యక్తం చేశారు. అధికారులు ఇంకా వైసీపీ ప్రభుత్వంలో ఉన్నట్లు ఫీల్ అయిపోతున్నారని చంద్రబాబు మండిపడ్డారని తెలిసింది.
వరద ప్రభావిత ప్రాంతాలలో అధికారులు ప్రవర్తించిన తీరుతో కూటమి ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని, ఇలాంటి అధికారులు పద్ధతి మార్చుకోకపోతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని సీఎం చంద్రబాబు నాయుడు కొందరు అధికారులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు అని వెలుగు చూసింది. గత వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ నాయకులతో అంటకాగిన, ఆ పార్టీ ముద్ర వేసుకున్న అధికారులు విజయవాడలోని వరద బాధిత ప్రాంతాల్లో విధుల్లో ఉన్నారు.

ఆహార పొట్లాలు, తాగునీరు బాటిల్లు బాధితులకు అందించడంలో కొందరు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఓ మంత్రి ఇదే సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి నుండి సమాచారం తెలుసుకున్న సీఎం చంద్రబాబు నాయుడు గోపాలకృష్ణ, సత్యానంద్, శ్రీకాంత్, రఘువీరారెడ్డి, విజయరావు, విజయరామిరెడ్డి అనే అధికారుల తీరుపై సమావేశంలోనే మండి పట్టారని తెలిసింది.
వైసీపీ ఆడినట్లు ఆడిన కొందరు అధికారులను వీఆర్ కు పంపించామని, అందుకు మా మీద పగతో వరద బాధితులకు అన్యాయం చెయ్యడానికే వీళ్లు మా మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని సీఎం చంద్రబాబు నాయుడుఆ అధికారుల తీరుపై మండిపడ్డారని తెలిసింది. మిమ్మల్ని వీఆర్కు పంపించినా ఇంకా బుద్ధి రాలేదని, మీ పద్ధతి మార్చుకొని ప్రభుత్వానికి సహకరిస్తే బాగుంటుందని, ఇలాంటి సమయంలో అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారని తెలిసింది.

విజయవాడలో వరద బాధితులకు సహాయం చేయడానికి ఒక వార్డుకు ఒక సీనియర్ అధికారిని నియమించారు. వరద బాధితులకు ఆహార పొట్లాలు, పండ్లు, వాటర్ బాటిల్ అందించే విషయంలో అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను పరిశీలించాలని, నిర్లక్షం చెయ్యకుండా వరద బాధితులను ఆదుకోవడానికి అందరూ సహకరించాలని సీఎం చంద్రబాబు నాయుడు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారని తెలిసింది.
-
Amaravati: అసెంబ్లీలో రాజధాని తీర్మానం-స్పీకర్, చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా!












Click it and Unblock the Notifications