వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విశ్రాంతి కోసం ఫ్యామిలీతో గోవాకు చంద్రబాబు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గత కొంతకాలంగా అవిశ్రాంతంగా నిత్యమూ పర్యటనలు, సమీక్షలతో తీవ్ర పని ఒత్తిడి మధ్య పాలన కొనసాగిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాస్త విశ్రాంతిని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే చంద్రబాబు, రెండు రోజుల విశ్రాంతి నిమిత్తం గోవా పర్యటనకు వెళ్లనున్నారు. శనివారం నాడు కుటుంబంతో సహా గోవాకు వెళ్లే ఆయన, తిరిగి వినాయక చవితి పర్వదినం నాడు తిరిగి వస్తారని సమాచారం.

Chandrababu will go to Goa with family

గత రెండు రోజులుగా అనంతపురంలో పర్యటిస్తున్న ఆయన, కర్నూలు జిల్లాలో ఆకస్మిక తనిఖీలు కూడా చేశారు. గురువారం కూడా అక్కడే గడపనున్న సంగతి తెలిసిందే. రాయలసీమ పర్యటన ముగిసిన చంద్రబాబు కుటుంబమంతా గోవాకు బయలుదేరనుంది.

ఇది ఇలా ఉండగా, తాజాగా ఓటుకు నోటు కేసు కూడా కొంత తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది. అయితే, ఆ కేసు తననేం చేయలేదని చంద్రబాబు ధీమాగా ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఏదేమైనా చంద్రబాబు బిజీ జీవితం నుంచి రెండు రోజులపాటు ప్రశాంతంగా గడపనున్నారు.

English summary
It is said that Andhra Pradesh CM Chandrababu Naidu will go to Goa with his family for two days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X