వైఎస్ జగన్: నాడు సీఎం కుమారుడిగా.. నేడు ముఖ్యమంత్రిగా..! కుటుంబ సెంటిమెంట్
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చూపిన బాటలో పయనిస్తున్నారు. తనకు స్ఫూర్తి తన తండ్రేనని పలుమార్లు స్పష్టం చేసిన వైఎస్ జగన్.. ఆయన తరహాలోనే పరిపాలన సాగిస్తున్నారనే గుర్తింపును పొందారు. తాజాగా- ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా వైఎస్ జగన్ తన కుటుంబ సభ్యులతో కలిసి జెరూసలేం పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. గురువారం ఆయన శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి జెరూసలేం వెళ్తారు.
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత వైఎస్ జగన్ విదేశీ పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి. జెరూసలేంను సందర్శించడం వైఎస్ కుటుంబానికి సెంటిమెంట్. ముఖ్యమంత్రిగా తన విదేశీ పర్యటనలను జెరూసలేం నుంచే శ్రీకారం చుట్టడం ల శుభసూచకంగా భావిస్తున్నారు వైఎస్ జగన్. తన తల్లి విజయమ్మ, భార్య భారతి, సోదరి షర్మిళ, ఆమె భర్త అనిల్ తో పాటు మరికొందరు కుటుంబ సభ్యులతో కలిసి జగన్ జెరూసలేం వెళ్తారు.

గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సైతం ముఖ్యమంత్రి హోదాలో జెరూసలేంను సందర్శించిన విషయం తెలిసిందే. అప్పట్లో ఆయన కూడా తన కుటుంబ సభ్యులతో కలిసి జెరూసలేం వెళ్లొచ్చారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడిగా జెరూసలేంకు వెళ్లొచ్చిన జగన్.. ఈ సారి ముఖ్యమంత్రి హోదాలో ఆ దేశ పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. ఈ పర్యటన పూర్తిగా వ్యక్తిగతం. సొంత ఖర్చులతో వైఎస్ జగన్ జెరూసలేం వెళ్లనున్నారు.
ప్రొటోకాల్ ప్రకారం.. జగన్ వెంట వ్యక్తిగత సిబ్బందితో పాటు స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ ఎస్పీ సెంథిల్ కుమార్, సీఎం వ్యక్తిగత భద్రతా అధికారి జోషి వెళ్లనున్నారు. జెరూసలేంలోని క్రైస్తవ పవిత్ర స్థలాలతో పాటు క్రీస్తు జన్మస్థలం బెత్లహాంను సందర్శిస్తారు. అనంతరం ఈ నెల 4వ తేదీన స్వదేశానికి తిరిగి వస్తారు. అనంతరం 5, 6, 7 తేదీల్లో ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్తారు. ఉప ప్రధాని ఎం వెంకయ్య నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, హోమ్ శాఖ మంత్రి అమిత్ షాలతో భేటీ అవుతారు.
-
వైసీపీ జోలికెళ్లను, జగన్ టార్గెట్ కాదు-రూటుమార్చిన షర్మిల..! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!!












Click it and Unblock the Notifications