బాబుపై టీ మంత్రి ఘాటుగా: మీరు చెబుతారా అని చినరాజప్ప
విశాఖ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును తెలంగాణలో అడుగు పెట్టనీయమన్న తెలంగాణ రాష్ట్ర మంత్రి మహేందర్ రెడ్డి పైన ఏపీ మంత్రి చినరాజప్ప మంగళవారం మండిపడ్డారు.
పదవి కోసం పార్టీని వీడి, తెలంగాణ రాష్ట్ర సమితిలోకి వెళ్లిన స్వార్థపరుడు మహేందర్ రెడ్డి అన్నారు. చంద్రబాబు పైన మహేందర్ రెడ్డి వ్యాఖ్యలు దురదృష్టకరమన్నారు.
మహిళల భద్రతపై...

మహిళల భద్రత కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని చినరాజప్ప తెలిపారు. విశాఖలో ఎటీఎం తరహాలో ఉండే ఐకేర్ సెంటర్ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. విశాఖపట్టణం ఎంతో అందమైన నగరమని, ఇలాంటి నగరంలో మొదటిగా ఐకేర్ సెంటర్ను ప్రారంభించామన్నారు.
దీని ద్వారా మహిళలు ఇకపై పోలీస్ స్టేషన్లకు వెళ్లకుండా నిర్భయంగా ఈ మెషిన్ ద్వారా ఫిర్యాదు చేయచ్చని, వాటిని పోలీసులు ఎప్పటికప్పుడు పరిశీలించి విచారిస్తారన్నారు. మహిళలు పోలీస్ స్టేషన్లకు వెళ్లాలంటే కొంత ఇబ్బందిగా భావిస్తారని, కానీ ఈ మెషిన్ల ద్వారా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫిర్యాదులు చేయవచ్చన్నారు. సమస్యలు ఎదుర్కొంటున్న మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
విరాళాలు ఇస్తే దాతల పేర్లు: కామినేని
నర్సింగ్ పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిందన్నారు. ఆశా ఆసుపత్రుల్లో ఉద్యోగుల హెల్త్ పాలసీ అమలుపై వారంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రత్యేక నర్సింగ్ డైరెక్టరేట్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్మాణానికి 25 శాతం విరాళాలు ఇస్తే దాతల పేర్లు పెడతామన్నారు.
-
కనిపించిన నెలవంక.. దేశవ్యాప్తంగా "రంజాన్" వేడుకలకు వేళాయే !! -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే?












Click it and Unblock the Notifications