ముద్రగడ పెద్ద నాయకుడేమీ కాదు: చినరాజప్ప, రావెల సుశీల్పైనా స్పందన
హైదరాబాద్: కాపు నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఫోన్ను ట్యాప్ చేయాల్సిన అవసరం తమకేమీ లేదని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి చినరాజప్ప అన్నారు. ముద్రగడ పెద్ద నాయకుడేమీ కాదని ఆయన వ్యాఖ్యానించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాంతిభద్రతలపై ఏపీ డిప్యూటీ సీఎం చినరాజప్ప సమీక్షించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
తుని ఘటనకు సంబంధించి ఎవరినీ అరెస్ట్ చేయలేదని ఓ ప్రశ్నకు సమాధానంగా మంత్రి చెప్పారు. కాపులను బీసీల్లో చేర్చే చిత్తశుద్ధి తమ నేత చంద్రబాబుకు ఉందని ఆయన స్పష్టం చేశారు. తన ఫోన్ను ప్రభుత్వం ట్యాప్ చేసిందని ముద్రగడ పద్మనాభం ఆరోపించిన విషయం తెలిసిందే.

ముద్రగడ దీక్షను తమ ప్రభుత్వం పట్టించుకోదని చినరాజప్ప చెప్పారు. పార్టీ మారిన శానససభ్యులపై స్పీకర్ చట్టప్రకారం చర్యలు తీసుకుంటారని ఆయన చెప్పారు.
రావెల కుమారుడి వ్యవహారాన్ని తెలంగాణ పోలీసులు చూసుకుంటారని మంత్రి చినరాజప్ప వివరించారు. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారం కాదని అన్నారు. తప్పు ఎవరు చేసిన తప్పించుకోలేరని ఆయన అన్నారు. చట్టం ముందు అందరూ సమానులేనని ఆయన అన్నారు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications