చినజీయరుస్వామి ఆశ్రమంలో ఏం జరుగుతోంది?
చినజీయరుస్వామి... ఈ పేరు రెండు తెలుగు రాష్ట్రాలకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మారుమూల పల్లెలను అభివృద్ధి చేయడంతోపాటు అక్షరాస్యతను పెంపొందించేందుకు జీయరు ఆశ్రమం చేస్తోన్న సేవలు ఖండాంతర ఖ్యాతిని సముపార్జించుకున్నాయి. సమాజానికి ఉపయోగపడే పనులు చేసుకుంటూ వస్తోన్న ఈ ఆశ్రమం ఇంతవరకు తనవైపు ఎవరూ వేలెత్తి చూపించే పనులు చేయలేదు.
చరిత్రపై మరకలు?
అకస్మాత్తుగా జీయరుస్వామి చరిత్రపై మరకలు పడేలా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఆశ్రమ కార్యక్రమాలతోపాటు కార్యకలాపాలు ప్రస్తుతం వివాదంగా మారాయంటున్నారు. చినజీయరు తర్వాత ఆయన మేనల్లుడు విష్ణు స్వామిదే పవర్. అతను విద్యాసంస్థలకు సంబంధించిన వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. ఆశ్రమానికి వచ్చిన కొత్తల్లో.. విష్ణు స్వామి అక్కడ ఫోటోలు తీసి మీడియాకు అందిస్తుండే వారు. అనంతరం జీయరు ఆశ్రమానికి సోషల్ మీడియాలో ప్రచారం కల్పించే బాధ్యతను తీసుకున్నాడు.

ఉత్తరాధికారి విష్ణుస్వామేనా?
ఈ ఆశ్రమం మొత్తానికి జీయరు తర్వాత ఉత్తరాధికారి విష్ణుస్వామే అన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే విష్ణుస్వామి పగలు స్వామి వేషంలో ఉంటారని, సాయంత్రంవేళ పబ్బులకు, క్లబ్బులకు తిరుగుతుంటారంటూ సోషల్ మీడియాలో పుంఖాను పుంఖలుగా వార్తలు వచ్చాయి. ఈ ఆశ్రమానికి ఉన్న నియమాలకు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరుంది. అమెరికాలోను అనేక ఆశ్రమాలున్నాయి. అటువంటి సంస్థలో విష్ణు స్వామి వ్యవహారం వివాదాస్పదంగా మారింది. దీనిపై జీయరు ఎలా స్పందిస్తారో తెలియరాలేదు.

వివాదాలు తప్పవా?
చినజీయర్ తన ఆశ్రమంలో లేదా ట్రస్టుల్లో ఎవరిని నియమించుకుంటారు? ఎవరికి బాధ్యతలు అప్పగిస్తారు? అనే విషయం ఎవరికీ అవసరం లేదు. ఎప్పుడైతే ఆయన రాజకీయ స్వామిగా మారారో అప్పుడే అందరికీ అవసరమైంది. మున్ముందు చినజీయర్ ఆశ్రమం విషయంలో మరిన్ని వివాదాలు వస్తాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. శారదాపీఠం పేరుతో రాజకీయాలు చేసే స్వరూపానంద స్వామి కూడా తన మేనల్లుడు అయిన యువకుణ్ని తన తర్వాత ఉత్తరాధికారిగా నియమించి ఇప్పటికే జోరుగా శిక్షణ కూడా ఇస్తున్నారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications