వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

90 కెజీల గోల్డ్, 131 కోట్లు సీజ్: డిజిపి, పోలింగ్‌కు భద్రత

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సీమాంధ్రలోని 13 జిల్లాల్లో బుధవారం ఎన్నికల పోలింగ్‌కు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని డిజిపి ప్రసాదరావు తెలిపారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. లక్షా 22వేల మంది పోలీసు సిబ్బందితో భద్రత ఏర్పాటు చేశామని, సమస్యాత్మక ప్రాంతాల్లో నాలుగు ప్రత్యేక హెలికాప్టర్లును కూడా సిద్ధం చేసినట్లు ఆయన చెప్పారు.

72 వేల మంది సివిల్ పోలీసులు, 284 పారామిలిటరీ, 69 ఏపిఎస్పి బలగాలను మోహరించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 5,938 కేసులు నమోదయ్యాయని డిజిపి తెలిపారు. 29,675 కోడ్ ఉల్లంఘన కేసులు నమోదయ్యాయని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Choppers to be Used to Monitor Polling in Maoist-hit Districts

ఇప్పటి వరకు రూ. 131 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు డిజిపి ప్రసాదరావు తెలిపారు. 33 లక్షల సీసాల మధ్యం సీజ్ చేసినట్లు చెప్పారు. 90 కిలోల బంగారం, 825 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. మద్యం, డబ్బు, బహుమతుల పంపిణీపై గట్టి నిఘా ఏర్పాటు చేశామన్నారు.

తూర్పుగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి భద్రతను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రసాదరావు తెలిపారు. మావోయిస్టుల ఆగడాలను అడ్డుకునేందుకు కౌంటర్ పార్టీని కూడా సిద్ధం చేశామని చెప్పారు. ఇప్పటికే కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

English summary
DGP Prasada Rao on Tuesday explained that the police would use choppers to monitor electioneering in Maoist-affected districts in the state following a call by Maoists to boycott general elections that will be held on May 7 in Seemandhra districts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X