చిత్తూరులో మైనర్ బాలికపై పాస్టర్ రెండేళ్లుగా అత్యాచారం
అమరావతి: చిత్తూరు జిల్లాలో ఓ పాస్టర్ నీచానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. స్ధానిక షర్మన్ బాలికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అరుల్ భర్త శామ్యూల్ ప్రపుల్ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు.
పెనుమూరు మండలానికి చెందిన ఓ బాలిక స్ధానికంగా ఉన్న హాస్టల్లో ఉంటూ షర్మన్ బాలికోన్నత పాఠశాల్లో చదువుకుంటోంది. రెండు సంవత్సరాలుగా శామ్యూల్ ప్రపుల్ ఆ బాలికపై రెండు సంవత్సరాలుగా వేధిస్తున్నట్లు తెలిసింది.
ఎప్పటిలాగే బాలికను శుక్రవారం ఇంటికి పిలిపించి అత్యాచారానికి పాల్పడ్డాడు. పాస్టర్ లైంగిక వేధింపులను తట్టుకోలేక బాలిక శనివారం జరిగిన విషయాన్ని పెదనాన్నకు చెప్పింది. దీంతో ఆయన వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ ఘటనపై కలెక్టర్ విచారణకు ఆదేశించారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు పాస్టర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.