అమ్మాయిలతో నగ్నంగా ప్రార్థనలు: ఆ కీచక పాస్టర్పై నన్నపనేని ఆగ్రహం
పశ్చిమగోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురంలో పాస్టర్ ముసుగులో కీచకుడిలా వ్యవహరిస్తున్న ఎబునేజర్పై కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ మహిళా ఛైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి స్పష్టం చే
పశ్చిమగోదావరి: జిల్లాలోని తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురంలో పాస్టర్ ముసుగులో కీచకుడిలా వ్యవహరిస్తున్న ఎబునేజర్పై కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ మహిళా ఛైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి స్పష్టం చేశారు.
అర్ధనగ్న ప్రార్థనలు చేయించి మహిళలపై లైంగిక దాడి
ఆడ పిల్లలను వారి తల్లిదండ్రులకు దూరం చేసి, లైంగిక వాంఛలు తీర్చుకుంటున్న ఎబునేజర్ అరాచకాలకు అడ్డుకట్ట వేస్తామని చెప్పారు.
అమరావతిలో బుధవారం ఆమె మాట్లాడుతూ.. జన్నాథపురం వెళ్తానని, ఎబునేజర్ చేతుల్లో మోసపోయిన యువతులను కలుస్తానని ఆమె అన్నారు. ఆ యువతుల సమస్యలు తెలుసుకుని, వారిని తల్లిదండ్రుల చెంతకు చేరుస్తానని అన్నారు.
ఎబునేజర్ లాంటి వ్యక్తులను కఠినంగా శిక్షించాలని నన్నపనేని చెప్పారు. కాగా, ఎబునేజర్ తాను దేవుడితో మాట్లాడుతానంటూ యువతులను లొంగదీసుకుంటాడని బాధితులు చెబుతున్నారు. నగ్నంగా ప్రార్థనలు చేయాలని యువతులను, మహిళలను వేధింపులకు గురిచేస్తున్నాడని చెప్పారు.
కాగా, తన చెరలో ఉన్న యువతులకు అతను ఏదో ఇస్తాడని, అందుకే అతనిని వారు వదిలి యువతులు వెళ్లడం లేదని అతని భార్య ఆరోపిస్తుండటం గమనార్హం. వారితో తెరచాటు వ్యవహారాలు నడపడం వల్లే తనను వదిలేశాడని ఆమె వాపోయింది.