సెల్ఫోన్లో నగ్నచిత్రాలు చూస్తూ పట్టుబడ్డ సీఐ, సస్పెండ్
విజయవాడ/హైదరాబాద్: బెజవాడ ఇంద్రకీలాద్రి పైన కొలువుదీరిన కనకదుర్గమ్మ గుడి పవిత్రతను ఓ సీఐ మంటకలిపాడు. సీఐ గుడి ఆవరణలో తన మొబైల్ ఫోన్లో నీలి చిత్రాలు చూస్తూ కెమెరాకు చిక్కాడు. మూలానక్షత్రం రోజున భక్తుల కోలాహలం మధ్య సీఐ ప్రసాద్ నగ్నచిత్రాలు చూస్తూ పట్టుబడ్డాడు.
ఓ మూలన తాపీగా కూర్చున్న సీఐ తన సెల్ఫోన్లో నగ్న చిత్రాలు చూసుకుంటూ గడిపాడు. అతని పైన భక్తులు మండిపడుతున్నారు. బందోబస్తు విధుల్లో ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని భక్తులు సదరు సీఐపై మండిపడుతున్నారు. ఈ వ్యవహారంపై పోలీసు ఉన్నతాధికారులు విచారణ జరుపుతున్నారు.
పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. దీపై కృష్ణా జిల్లా ఎస్పీ విజయ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని విజయవాడ శాంతిభద్రతల డీసీపీని ఆదేశించారు. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకున్నారు. అతనిని సస్పెండ్ చేశారు. కాగా, ఈ రోజు అమ్మవారు సరస్వతీ రూపంలో కనిపించనుంది. దీంతో భారీగా భక్తులు తరలి వస్తున్నారు.
సాయినగర్లో దారుణ హత్య
ఎల్బీ నగర్ సమీపంలోని సాయి నగర్ కాలనీలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. దుండగులు గుర్తు తెలియని వ్యక్తిని బండరాళ్లతో మోదీ హతమార్చారు. ఘటన పైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు. సిఐ ప్రసాద్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ఆదేశాల మేరకు సస్పెండ్ చేశారు.