మాజీ మంత్రి నారాయణకు సీఐడీ నోటీసులు..!!
ఏపీలో టీడీపీ నేతల చుట్టూ కేసుల ఉచ్చు బిగుస్తోంది. మాజీ మంత్రి నారాయణకు సీఐడీ నోటీసులు జారీ చేసింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఈ నెల 4న విచారణకు రావాలని సీఐడీ నోటీసుల్లో పేర్కొంది. ఈ కేసులో నారాయణ హైకోర్టులో ఇప్పటికే ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసారు. ఈ సమయంలోనే సీఐడీ నోటీసులు జారీ చేసింది. లోకేశ్ ను విచారణకు పిలిచిన సమయంలోనే ఇప్పుడు సీఐడీ నారాయణకు నోటీసులు ఇచ్చింది.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కాంలో ఏ2గా ఉన్న నారాయణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ మీద బయట ఉన్నారు. తాజాగా ఈ కేసులో సీఐడీ దూకుడు పెంచింది. ఇప్పటికే ఈ కేసులో చంద్రబాబుతో పాటుగా లోకేశ్ పేర్లను చేర్చింది. ఇదే కేసులో లోకేశ్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. 41ఏ నోటీసులు జారీ చేయాలని హైకోర్టు సూచనలతో సీఐడీ తాజాగా లోకేశ్ కు నోటీసులు అందించింది. ఈ నెల 4న విచారణకు రావాలని పేర్కొంది. ఇదే సమయంలో ఇప్పుడు నారాయణకు అదే సమయంలో విచారణ రావాలంటూ సీఐడీ నోటీసులు జారీ చేసింది. నారాయణ ఇప్పటికే ఇదే కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు.

ఇప్పుడు ఒకటే కేసులో మాజీ మంత్రులుగా ఉన్న లోకేశ్..నారాయణ కు సీఐడీ నోటీసులు జారీ చేయటం..ఒకే సమయం కేటాయించటం ద్వారా ఇద్దరినీ కలిపి విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీ ప్రభుత్వ సమయంలో అమరావతి మాస్టర్ ప్లాన్ లో అక్రమాలు జరిగాయని మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే ఫిర్యాదు మేరకు సీఐడీ పోలీసులు కేసులు నమోదు చేసారు. ఇందులో ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ పేరిట జరిగిన భారీ అవినతి దర్యాప్తులో వెలుగు చూసింది. ఏ-1గా చంద్రబాబు, ఏ-2గా మాజీ మంత్రి నారాక్ష్న పేరును సీఐడీ ఈ కేసులో చేర్చింది. ఇక, ఇప్పుడు నారాయణకు నోటీసులు జారీ చేయటంతో.. అటు చంద్రబాబు కేసులో హైకోర్టులో విచారణ..ఆ మరుసటి రోజునే విచారణకు సీఐడీ నోటీసులు ఇవ్వటంతో జరిగే పరిణామాలపైన ఉత్కంఠ కొనసాగుతోంది.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications