బాబు బెదిరించారు, అమరావతికి రుణమిస్తే ఆత్మహత్య: ప్రపంచ బ్యాంకు ప్రతినిధులకు హెచ్చరిక
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం, నిధులు, వ్యయం తదితర అంశాల పరిశీలకు ప్రపంచ బ్యాంకు రాజధాని ప్రాంతంలో గురువారం పర్యటించింది. ఈ సందర్భంగా రైతులు చంద్రబాబు ప్రభుత్వంపై ఫిర్యాదు చేశారు.
Recommended Video

అమరావతి: నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం, నిధులు, వ్యయం తదితర అంశాల పరిశీలకు ప్రపంచ బ్యాంకు రాజధాని ప్రాంతంలో గురువారం పర్యటించింది. ఈ సందర్భంగా రైతులు చంద్రబాబు ప్రభుత్వంపై ఫిర్యాదు చేశారు.

బలవంతంగా లాక్కున్నారు
రైతులు ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల ఎదుట తమ ఆందోళన వ్యక్తం చేశారు. వారు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. మూడు పంటలు పండే భూములను బలవంతంగా లాక్కున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కారణంగా బంగారం వంటి తమ భూములు కోల్పోయామని చెప్పారు.

ఎక్కువ ధరకు అమ్మకం.. బాబు ప్రభుత్వంపై సంచలన ఆరోపణ
మా వద్ద నుంచి భూమిని బలవంతంగా తీసుకున్నారని ఆరోపించారు. రూ.18 లక్షలు ఇచ్చి భూములు తీసుకున్నారని, వారు మాత్రం రూ.50 లక్షలకు అమ్ముకుంటున్నారని సంచలన ఆరోపణలు చేశారు. మంచి భూములను నాశనం చేస్తున్నారన్నారు. తాము ఎట్టి పరిస్థితుల్లోను భూములు ఇచ్చే ప్రసక్తి లేదన్నారు.

వాటికి భూములిచ్చేందుకు సిద్ధం
మౌలిక సదుపాయాలకు భూములు ఇచ్చేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని రైతులు చెప్పారు. గతంలో నెలకు తమకు రూ.12 వేలు గిట్టుబాటు అయ్యేదని, ఇప్పుడు మాత్రం నెలకు కేవలం రూ.2,500 మాత్రమే వస్తోందని రైతు కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు.

ధర పడిపోయింది
రాజధాని ప్రకటనకు ముందు నిడమర్రు, బేతపూడి గ్రామాల్లో సుమారు రూ.2 కోట్లున్న ఎకరం ధర, ప్రకటన తర్వాత రూ.కోటిన్నరకు పడిపోయిందని నిడమర్రు, కురగల్లు గ్రామాలకు చెందిన భూసమీకరణ, భూసేకరణలను వ్యతిరేకిస్తున్న రైతులు, వైసిపి, సీపీఎం నాయకులు ప్రపంచబ్యాంకు ప్రతినిధులకు తెలిపారు.

మంత్రులు భయపెట్టి తీసుకున్నారు
భూసమీకరణకు గ్రామంలో 730 ఎకరాలు ఇవ్వలేదని వైసిపి నాయకులు, రైతులు ప్రపంచ బ్యాంకు ప్రతినిధులకు తెలిపారు. మిగతా భూమిని ప్రభుత్వం, మంత్రులు రైతులను భయభ్రాంతులకు గురిచేసి తీసుకున్నారని ఆరోపించారు. భూసమీకరణలో పొలాలు ఇవ్వని రైతులమంతా హైకోర్టును ఆశ్రయించి, స్టే ఆర్డరు పొందామని బ్యాంకు ప్రతినిధులకు తెలిపారు.

రాజధానికి రుణం ఇస్తే ఆత్మహత్య
రాష్ట్ర ప్రభుత్వానికి రుణమిస్తే తాము ఆత్మహత్యలు చేసుకుంటామని బ్యాంకు ప్రతినిధులను కొందరు హెచ్చరించారు. మరి మిగతా రైతులు భూములు ఎందుకిచ్చారని రైతులను ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు ప్రశ్నించారు. రాజధాని ప్రాంత పశ్చిమ గ్రామాల్లో నీటి ఎద్దడి ఉందని, ఏటా ఒక్క పంటే పండుతుందని, కొండవీటివాగు ముంపుతో పంటలు నష్టపోతారని, అక్కడి భూములకు పెద్దగా విలువ లేదని కొందరు రైతులు తెలిపారు. పూలతోటలు ఉంటే ఎకరానికి రూ.80వేల నుంచి రూ.లక్ష వరకూ వార్షిక ఆదాయం వస్తుందన్నారు. రైతులు చెప్పిన అంశాలను ప్రపంచ బ్యాంకుకు నివేదిస్తామని అధికారులు చెప్పారు.
-
స్టీల్ ప్లాంట్ కి కాదు స్టీల్ సిటీకి పునాది.. ప్రపంచస్థాయి నగరంగా విశాఖ: చంద్రబాబు! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications